News November 26, 2025

రైతులకు నష్టం లేకుండా ప్రభుత్వం చర్యలు: కలెక్టర్

image

ధాన్యం పంట కోత సమయంలో రైతులకు నష్టం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. జిల్లాలో 74 రైస్ మిల్లులు ఉండగా, యజమానులంతా బ్యాంకు పూచికతలు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉందన్నారు. రెండు లక్షల టన్నుల ధాన్యం సేకరణ నేపథ్యంలో రూ.200 కోట్లు పూచికతలు రైస్ మిల్లుల నుంచి రావాలన్నారు. ప్రతి మిల్లులో తేమ యంత్రాలు విధిగా ఉండాలన్నారు. అధికారులు చిత్తశుద్ధితో సరిగ్గా పని చేయాలన్నారు.

Similar News

News November 28, 2025

పల్నాడు పర్యాటకం ఇక కళకళ..

image

పర్యాటక శాఖ స్వదేశీ దర్శన్‌లో భాగంగా పల్నాడు జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అమరావతిలోని 125 అడుగుల జ్ఞాన బుద్ధ విగ్రహం, కోటప్పకొండ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే DPR సిద్ధం చేశారు. సాగర్ వద్ద వరల్డ్ క్లాస్ బుద్ధిష్ట్ హెరిటేజ్ సెంటర్, గుత్తికొండ బిలం రహదారి, అమరావతి కాలచక్ర మ్యూజియం అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

News November 28, 2025

మిరపలో మొవ్వుకుళ్లు తెగులు లక్షణాలు

image

మొవ్వుకుళ్లు తెగులు ఆశించిన మిరప మొక్కల చిగుర్లు ఎండిపోతాయి. కాండంపై నల్లని మచ్చలు ఏర్పడి క్రమేణా చారలుగా మారుతాయి. కొన్ని మొక్కల్లో ఆకులపై వలయాలుగా మచ్చలు ఏర్పడి పండుబారి రాలిపోతాయి. మొవ్వుకుళ్లు తెగులు ముఖ్యంగా తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. బెట్టపరిస్థితులలో, అధిక నత్రజని మోతాదు వలన, తామర పురుగుల ఉద్ధృతి ఎక్కువవుతుంది. నీటి ద్వారా ఈ వైరస్ ఇతర మొక్కలకు వ్యాపిస్తుంది

News November 28, 2025

మిరపలో మొవ్వుకుళ్లు తెగులు నివారణ ఎలా?

image

మిరపలో మొవ్వుకుళ్లు తెగులుకు కారణమయ్యే తామర పురుగు నివారణకు లీటరు నీటికి ఫిప్రోనిల్ 2ml లేదా స్పైనోశాడ్ 0.25ml లేదా అసిటామిప్రిడ్ 0.2గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3mlలలో ఒక దానిని కలిపి పిచికారీ చేయాలి. గట్లమీద కలుపు మొక్కలు వైరస్‌లకు స్థావరాలు. వీటిని పీకి నాశనం చేయాలి. వైరస్ సోకిన మిరప మొక్కలను కాల్చివేయాలి. పొలం చుట్టూ 2 నుండి 3 వరుసల సజ్జ, జొన్న, మొక్కజొన్నను రక్షణ పంటలుగా వేసుకోవాలి.