News September 8, 2025
రైతులకు భరోసా కల్పించిన కలెక్టర్ లక్ష్మీశ

కలెక్టర్ లక్ష్మీశ విజయవాడ, ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, మైలవరం, నందిగామ, పెనుగంచిప్రోలు మండలాల్లో పర్యటించి రైతులతో ముచ్చటించారు. యూరియా సరఫరా పరిస్థితులను స్వయంగా పరిశీలించి, ప్రభుత్వం నిరంతర పర్యవేక్షణలో ఎరువులు అందుబాటులో ఉంటాయని భరోసా ఇచ్చారు. అగ్రికల్చర్ అవుట్డోర్ కార్యక్రమంలో అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. ఎరువులు సమృద్ధిగా ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ తెలిపారు.
Similar News
News September 8, 2025
హనుమకొండ: నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం పనిచేశారు: MLA

నమ్మిన సిద్ధాంతం కోసం సురవరం సుధాకర్ రెడ్డి జీవితాంతం పనిచేశారని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. హనుమకొండలో ఈరోజు నిర్వహించిన సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభకు ఎమ్మెల్యే హాజరయ్యారు. పేదలు, కార్మికులు, రైతుల కోసం ఆయన సాగించిన పోరాటం ఎప్పటికీ చిరస్మరణీయమని ఎమ్మెల్యే నాగరాజు కొనియాడారు.
News September 8, 2025
‘దానం’ డిస్క్వాలిఫికేషన్ ఎపిసోడ్.. కాంగ్రెస్ ప్లాన్- బీ?

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు తప్పించేందుకు కాంగ్రెస్ ప్లాన్-బీ రచిస్తున్నట్లు సమాచారం. దానంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పోటీ చేయిస్తే ఎలా ఉంటుందని పార్టీ సీనియర్ నాయకులతో అధిష్ఠానం చర్చించినట్లు తెలిసింది. ఈ విషయంపై గాంధీ భవన్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
News September 8, 2025
HYD: రోడ్డున పడేయలేదనా? రోడ్డుపై వదిలేశారు!

నగరవ్యాప్తంగా గణపయ్య ప్రతిమలను రోడ్లపైనే విక్రయించారు. ఆ విగ్రహాలను అమ్మి సొమ్ముచేసుకుని మిగిలిపోయినవి ఇలా ఎర్రగడ్డలో రోడ్లపైనే వదిలేశారు. లాభాలు ఇచ్చినందుకా ఇలా ఆయన బొమ్మలను రోడ్డుపై వదిలేశారని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి సనత్నగర్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. DCM వ్యాన్లో వాటిని తీసుకెళ్లి బేబీవాటర్ పాండ్, IDL చెరువులో నిమజ్జనం చేశారు. సతీశ్, సాయి ప్రకాశ్, రణ్వీర్, బవేశ్ కార్తీక్ ఉన్నారు.