News October 4, 2025

రైతులకు మద్దతు ధర లభించేలా చర్యలు చేపట్టాలి: అ.కలెక్టర్

image

రైతులు పండించిన పంటలకు మద్దతు ధర లభించేలా చర్యలు చేపట్టాలని అ. కలెక్టర్ శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో వానాకాలం ధాన్యం కొనుగోలు, కపాస్ కిసాన్ యాప్‌పై నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో మాట్లాడారు. పత్తి కొనుగోలు సేవలపై రైతులకు సమాచారం అందించారు. పత్తి కొనుగోళ్లకు సంబంధించి సందేహాలు ఉంటే రైతులు టోల్‌ఫ్రీ నంబర్ 18005995779 లేదా వాట్సాప్ నంబర్ 8897281111ను సంప్రదించాలని కోరారు.

Similar News

News October 6, 2025

కల్లూరు: 22 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు

image

కల్లూరు ప్రభుత్వ పాఠశాలలో 2002లో పదవ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు 22 సంవత్సరాల తర్వాత ఆదివారం ఒకచోట కలుసుకున్నారు. ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకుని పరవశించిపోయారు. తమ తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆటపాటలతో ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా వారు తమ గురువులైన రాములు, యాకోబు, ముస్తఫా, నాగేశ్వరరావు, కుసుమ, ఉషారాణిలను సన్మానించి జ్ఞాపికలను అందజేశారు.

News October 4, 2025

ఖమ్మం: స్థానిక ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష

image

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను నిబంధనల ప్రకారం కట్టుదిట్టంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ శ్రీజ అధికారులను ఆదేశించారు. జిల్లా, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నామినేషన్ల స్వీకరణ, పోస్టల్ బ్యాలెట్, టీమ్‌ల ఏర్పాటు వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు పూర్తిస్థాయిలో శిక్షణ పొందాలని సూచించారు. అవసరమైన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయాలని ఆదేశించారు.

News October 3, 2025

ఎర్రుపాలెం: మనవడి చేతిలో అమ్మమ్మ హత్య..?

image

ఎర్రుపాలెం మండలం సకినవీడు గ్రామంలో దారుణ హత్య జరిగింది. గ్రామానికి చెందిన శాఖమూరి పద్మ (60)ను ఆమె మనవడు శాఖమూరి చీరాల సాయి శుక్రవారం హతమార్చినట్లు చర్చించుకుంటున్నారు. పద్మ నిద్రిస్తుండగా ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.