News February 22, 2025

రైతులకు మేలు జరిగేలా అధికారులు కృషి చేయాలి: కలెక్టర్

image

రైతులకు అన్ని రకాలుగా మేలు చేయాలనే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి అన్నారు. రైతుల రిజిస్ట్రేషన్, యూరియా అమ్మకాలు, ఈ పంట, ఈ కేవైసీ, లోన్ల మంజూరు పై కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం వ్యవసాయ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతు రిజిస్ట్రేషన్ కార్యక్రమం పై మండల వారీగా వివరాల గురించి ఆరా తీశారు.

Similar News

News November 5, 2025

OFFICIAL: కమల్ ప్రొడక్షన్‌లో రజినీ సినిమా

image

తమిళ సినీ దిగ్గజాలు రజినీకాంత్, కమల్ హాసన్ ఓ సినిమా కోసం చేతులు కలిపారు. కమల్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో రజినీకాంత్ హీరోగా ఈ మూవీ తెరకెక్కనుంది. దీనికి సి.సుందర్ దర్శకత్వం వహించనున్నారు. సూపర్ స్టార్‌కు 173వ సినిమా ఇది. ఈ మూవీని 2027 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు కమల్ హాసన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

News November 5, 2025

గ్రీవెన్స్, ఉద్యోగవాణి యథాతథం: కలెక్టర్

image

రేపు నిర్వహించే గ్రీవెన్స్, ఉద్యోగవాణి కార్యక్రమం యథావిధిగా ఉంటుందని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ప్రజలు, ఉద్యోగుల సమస్యలపై దరఖాస్తులను స్వీకరిస్తామని కలెక్టర్ బుధవారం పేర్కొన్నారు. జిల్లా ప్రజలు నేరుగా కార్యాలయానికి వచ్చి తమ ఫిర్యాదులు ఇవ్వొచ్చని తెలిపారు.

News November 5, 2025

టీటీడీకి రూ.1000 కోట్ల విరాళాలు: బీఆర్ నాయుడు

image

AP: గత ఏడాది కాలంలో TTDకి రూ.1000Cr విరాళాలు వచ్చాయని బోర్డు ఛైర్మన్ BR నాయుడు వెల్లడించారు. ఛైర్మన్‌గా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘శ్రీవాణి ట్రస్ట్ కింద 5వేల ఆలయాలు నిర్మించాలని తీర్మానించాం. తిరుపతి-తిరుమల మధ్య ఎలక్ట్రికల్ బస్సులు నడపాలని యోచిస్తున్నాం. తిరుపతి విమానాశ్రయానికి శ్రీవెంకటేశ్వర ఎయిర్‌పోర్టుగా నామకరణం చేస్తాం’ అని పేర్కొన్నారు.