News July 4, 2025
రైతులు దుష్ప్రచారాలను నమ్మవద్దు: ఢిల్లీరావు

ఎరువుల తయారీదారులు, పంపిణీదారులతో వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్.ఢిల్లీరావు శుక్రవారం విజయవాడలో సమావేశమయ్యారు. యూరియా ఎరువుల నిల్వలు రాష్ట్రంలో సమృద్ధిగా ఉన్నాయని, గత ఏడాదితో పోలిస్తే 30% అధికంగా యూరియా నిల్వలు ఉన్నాయని ఢిల్లీరావు చెప్పారు. ఎరువుల లభ్యతపై రైతాంగం దుష్ప్రచారాలను నమ్మవద్దన్నారు. డీలర్లు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
Similar News
News July 5, 2025
పాప్ సింగర్స్ను వెనక్కినెట్టిన అర్జీత్

బాలీవుడ్ స్టార్ సింగర్ అర్జీత్ సింగ్ మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ స్పాటిఫైలో 151 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో టేలర్ స్విఫ్ట్(139.6M), ఎడ్ షీరన్(121M) వంటి ఇంటర్నేషనల్ స్టార్స్ను వెనక్కినెట్టారు. అత్యధిక ఫాలోవర్లు కలిగిన సింగర్గా నిలిచారు. అర్జీత్ తర్వాత ఇండియన్స్లో ఏఆర్ రెహమాన్(65.6M) 14వ స్థానం, ప్రీతమ్(53.4M) 21, నేహా కక్కర్(48.5M) 25వ ప్లేస్లో ఉన్నారు.
News July 5, 2025
జైస్వాల్ ఖాతాలో అరుదైన రికార్డు

ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత ఓపెనర్ జైస్వాల్ అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నారు. రెండో ఇన్నింగ్స్లో 28 రన్స్ చేసి ఔటైన జైస్వాల్ టెస్టుల్లో వేగంగా 2000 రన్స్ పూర్తిచేసిన భారత ప్లేయర్గా నిలిచారు. 40 ఇన్నింగ్స్ల్లో ఈ మైలురాయి చేరుకుని లెజెండ్స్ సెహ్వాగ్, ద్రవిడ్ సరసన చేరారు. మరోవైపు దిగ్గజం సచిన్ తర్వాత 2 వేల రన్స్ పూర్తిచేసిన రెండో యంగెస్ట్ ప్లేయర్గా జైస్వాల్ నిలిచారు.
News July 5, 2025
మతపరమైన అంశాల్లో కలగజేసుకోం: భారత్

భారత ప్రభుత్వం మతపరమైన అంశాల్లో జోక్యం చేసుకోదని ఫారిన్ మినిస్ట్రీ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. టిబెట్ బౌద్ధమత గురువు దలైలామా వారసుడి ఎంపిక విషయంలో నెలకొన్న వివాదంపై ఆయన స్పందించారు. ‘మత విశ్వాసాలపై ప్రభుత్వం ఎలాంటి స్టాండ్ తీసుకోదు. భారత్లో మతపరమైన స్వేచ్ఛకు కట్టుబడి ఉన్నాం’ అని వ్యాఖ్యానించారు. కాగా ఈ విషయంలో కలగజేసుకోవద్దని భారత్ను చైనా <<16940241>>హెచ్చరించిన <<>>విషయం తెలిసిందే.