News March 28, 2025

రైతులు పరిహారం సద్వినియోగించుకోవాలి: VKB కలెక్టర్

image

ప్రభుత్వం అందజేస్తున్న నష్టపరిహారాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. గురువారం వికారాబాద్ కలెక్టరేట్‌లో కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం హకీంపేటకు సంబంధించిన పట్టా భూమి కలిగిన రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సమ్మతి తెలిపిన రైతులకు తాండూర్ సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్‌లతో కలిసి నష్ట పరిహార చెక్కులను జిల్లా కలెక్టర్ అందజేశారు.

Similar News

News March 1, 2026

HYD: పాతబస్తీలో రోబోటిక్ టెక్నాలజీతో డీ-సిల్టింగ్!

image

పాతబస్తీలోని మురుగునీటి సమస్యల పరిష్కారానికి జలమండలి కొత్త రోబోటిక్ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. విజయనగర్ కాలనీ సెక్షన్ పరిధిలోని మల్లేపల్లి ఎక్స్ రోడ్ వద్ద డీ-సిల్టింగ్ పనులను జలమండలి MD అశోక్ రెడ్డి, హైడ్రాకమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సీవర్ లైన్లలో ఏర్పడిన పూడికను తొలగించడానికి ఉపయోగపడుతుందన్నారు. ఆధునిక పద్ధతులతో త్వరగా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యమని అన్నారు.

News March 1, 2026

ఎయిర్‌పోర్టుల్లో చిక్కుకున్న భారత ప్లేయర్స్

image

ఇరాన్‌ దాడుల నేపథ్యంలో పలు గల్ఫ్ దేశాల ఎయిర్ పోర్టుల్లో భారత ఆటగాళ్లు చిక్కుకున్నారు. దుబాయ్ ఎయిర్‌పోర్టులో ఓలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు చిక్కుకోగా.. ఖతర్‌లోని దోహా ఎయిర్‌పోర్టులో భారత బాస్కెట్‌బాల్ జట్టు ఇరుక్కుపోయింది. సింధు ఆల్ ఇంగ్లండ్ టోర్నీ ఆడేందుకు బర్మింగ్‌హామ్ వెళ్లాల్సి ఉండగా.. ఖతర్‌తో 2027 WC కోసం FEB 27న క్వాలిఫైయర్స్ మ్యాచ్ ఆడిన భారత బాస్కెట్‌బాల్ జట్టు భారత్ తిరిగిరావాల్సి ఉంది.

News March 1, 2026

ఆటగాళ్లు, అభిమానుల క్షేమం ముఖ్యం: ICC

image

మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం వేళ T20 WCకి వచ్చిన ప్రతి క్రికెటర్, అభిమానిని క్షేమంగా ఇంటికి పంపడం తమ బాధ్యత అని ICC తెలిపింది. ఇప్పటికే ట్రావెల్, లాజిస్టిక్స్, సెక్యూరిటీ టీమ్‌లను సిద్ధం చేసినట్లు చెప్పింది. WC కోసం వచ్చిన, రావాలనుకునే అభిమానులు తమ సలహాలను తప్పకుండా పరిశీలించాలని కోరింది. యుద్ధం వల్ల పలు దేశాల ఎయిర్ స్పేస్‌లు ఇప్పటికే మూసివేయడంతో ICC ఈ ప్రకటన చేసింది. అటు మార్చి 8న ఫైనల్ జరగనుంది.