News March 28, 2025

రైతులు పరిహారం సద్వినియోగించుకోవాలి: VKB కలెక్టర్

image

ప్రభుత్వం అందజేస్తున్న నష్టపరిహారాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. గురువారం వికారాబాద్ కలెక్టరేట్‌లో కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం హకీంపేటకు సంబంధించిన పట్టా భూమి కలిగిన రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సమ్మతి తెలిపిన రైతులకు తాండూర్ సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్‌లతో కలిసి నష్ట పరిహార చెక్కులను జిల్లా కలెక్టర్ అందజేశారు.

Similar News

News February 28, 2026

BREAKING: జగిత్యాల జిల్లాలో పెద్దపులి కలకలం!

image

జగిత్యాల జిల్లాలో పెద్దపులి సంచారం వార్త స్థానికంగా కలకలం రేపుతోంది. భీమారం మండలం మోత్కురావుపేటలో 3 మూగ జీవాలపై పెద్దపులి దాడి చేసిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. 2 రోజులుగా పెద్దపులి తమ గ్రామంలో సంచరిస్తోందంటూ గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలిస్తున్నారు. పశువైద్యాధికారులు గాయపడిన మూగజీవాలకు చికిత్స చేశారు.

News February 28, 2026

మల్బరీ తోటను పరిశీలించిన మంత్రి సవిత

image

పరిగి మండలంలో పింఛన్ పంపిణీకి వెళ్తుండగా మనేసముద్రం సమీపంలో రైతు చౌడప్పకు చెందిన మల్బరీ తోటను మంత్రి సవిత పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె రైతుతో మాట్లాడి పంట దిగుబడి, పెట్టుబడి, రాబడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మల్బరీ సాగులో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్న ఆమె.. రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

News February 28, 2026

HYDలో సిల్ట్ ఛాంబర్ లేకుండా.. వేల హోటళ్లు!

image

HYDలో సిల్ట్ ఛాంబర్లు లేకుండా వేల సంఖ్యలో హోటళ్లు, రెస్టారెంట్లు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ జలమండలి కఠిన చర్యలు చేపట్టడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. హోటల్ రెస్టారెంట్ల నుంచి భారీగా కూరగాయల వ్యర్ధాలు వచ్చి డ్రైనేజీలో కలుస్తుండడంతో బ్లాక్ కేజీ జరిగి మ్యాన్ హోల్స్ నుంచి పొంగి పొర్లుతుంది. దీంతో సిల్ట్ ఛాంబర్ తప్పనిసరి చేశారు. కానీ జరిమానాలు విధించడం మున్నాళ్ల ముచ్చటగా మారిందంటున్నారు.