News February 22, 2025
రైతు ఆత్మహత్యాయత్నం.. విచారణకు కలెక్టర్ ఆదేశం

నెల్లిమర్ల మండలం చనుమల్లు పేట గ్రామానికి చెందిన చనుమల్లు అబద్ధం అనే రైతు మ్యుటేషన్ కోసం రెవెన్యూ అధికారులు లంచం డిమాండ్ చేస్తున్నారని, శుక్రవారం నెల్లిమర్ల తహశీల్దార్ కార్యాలయం వద్ద<<15539536>> ఆత్మహత్యాయత్నం<<>> చేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై కలెక్టర్ అంబేడ్కర్ శనివారం స్పందించారు. విజయనగరం RDOను విచారణా అధికారిగా నియమించి సంఘటన పై సమగ్రంగా విచారణ జరిపి నివేదికను అందించాలని ఆదేశించారు.
Similar News
News February 23, 2025
రైతుల సమక్షంలోనే రీ సర్వే ప్రక్రియ: JC

రైతుల సమక్షంలోనే రీ సర్వే ప్రక్రియను నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ అధికారులను ఆదేశించారు. భోగాపురం మండలంలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకున్న రావాడ గ్రామంలో నిర్వహిస్తున్న రీ సర్వే ప్రక్రియను ఆయన పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. గ్రౌండ్ ట్రూతింగ్ను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
News February 23, 2025
VZM: 12 సెంటర్లు.. 6,265 మంది అభ్యర్థులు

జిల్లాలో ఆదివారం గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు యథాతథంగా జరగనున్నాయని జేసీ సేతు మాధవన్ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షల నిర్వహణకు 12 కేంద్రాలు ఏర్పాటు చేశామని, 6,265 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్- 2 పరీక్షలు జరుగుతాయన్నారు. నిర్ణీత సమయానికి కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
News February 23, 2025
VZM: సబ్ జైలును తనిఖీ చేసిన న్యాయమూర్తి

విజయనగరం సబ్ జైలును అదనపు సివిల్ న్యాయమూర్తి టీవీ రాజేష్ తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించి పలు చట్టాలపై అవగాహన కల్పించారు. ఖైదీల పట్ల సిబ్బంది గాని తోటి ఖైదీలు కానీ ఎటువంటి వివక్షత చూపించరాదని సూచించారు. ఖైదీల పట్ల వివక్షత చూపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం లీగల్ ఎయిడ్ కేంద్రాన్ని సందర్శించారు.