News October 14, 2025

రైతు జీవితానికి చిహ్నం!

image

ఒకప్పుడు రైతు జీవితానికి ప్రతీకగా ఉన్న ఎద్దులు నేటి కాలంలో కనుమరుగవుతున్నాయి. ట్రాక్టర్లు, యంత్ర వ్యవసాయం ప్రబలడంతో ఎద్దుల అవసరం తగ్గిపోయింది. పంట సీజన్‌లో మాత్రమే కొందరు రైతులు వాటిని ఉపయోగిస్తున్నారు. ఆధునికత పెరుగుతున్న కొద్దీ గ్రామీణ సంప్రదాయ వ్యవసాయ పద్ధతులు క్రమంగా అంతరించిపోతున్నాయనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. మరి మీరు ఎద్దులతో సేద్యం చేశారా? కామెంట్ చేయండి..

Similar News

News October 14, 2025

BREAKING: బాపట్ల జిల్లా వాసి దారుణ హత్య

image

తెనాలిలోని చెంచుపేటలో బాపట్ల జిల్లా వాసి దారుణ హత్యకు గురయ్యాడు. అమృతలూరు (M) కోడితాడిపర్రుకు చెందిన జూటూరు బుజ్జి (50) కైలాష్ భవన్ రోడ్డులో మంగళవారం టిఫిన్ కోసం వచ్చాడు. ఆ సమయంలో స్కూటీపై వచ్చిన ఓ వ్యక్తి కొబ్బరికాయల కత్తితో హత్య చేశాడు. 3 టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. కాగా మృతుడు తన కూతురుని చూసేందుకు చెంచుపేటకు వచ్చినట్లు సమాచారం.

News October 14, 2025

తెనాలిలో హత్య.. మృతుని వివరాలు..!

image

తెనాలి చెంచుపేటలోని కైలాశ్ భవన్ రోడ్డులో బుజ్జిని పట్ట పగలే హత్య చేసిన విషయం తెలిసిందే. మాస్క్ ధరించి స్కూటీపై వచ్చిన వ్యక్తి హత్య చేసి పరారైనట్లు స్థానికులు చెప్తున్నారు. కాగా మృతుడు బాపట్ల జిల్లా అమృతలూరు (M) కోడితాడిపర్రుకి చెందిన వాసిగా పోలీసులు గుర్తించారు. మృతుడు తమ కుమార్తెను చూసేందుకు చెంచుపేటకు వచ్చినట్లు సమాచారం.

News October 14, 2025

PDPL: లొంగిపోయిన మావోయిస్టు మల్లోజుల వేణుగోపాల్..!

image

PDPL పట్టణానికి చెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్, సోను మంగళవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. MHలోని గడిచిరోలిలో 60మందితో కలిసి సరెండరయ్యారు. ఇక మల్లోజులపై రూ.కోటి రివార్డుంది. అయితే తాను లొంగిపోయేది లేదని గతంలో తల్లి మధురమ్మకు వేణుగోపాల్ లేఖ రాశారు. కాగా వేణుగోపాల్ సోదరుడు, కేంద్ర కమిటీ సభ్యుడు కోటేశ్వరరావు బెంగాల్‌లో గతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందారు.