News January 25, 2025

రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలి: జనగామ కలెక్టర్

image

రైతు భరోసా పథకం కింద కొత్తగా పట్టాదారు పాసు పుస్తకం వచ్చిన రైతులు, ఇంతకు ముందే పాసు పుస్తకం కలిగి ఉండి కూడా దరఖాస్తు చేసుకోని వారు ఈ నెల 31లోగా ఏఈవోల వద్ద దరఖాస్తు చేసుకోవాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. అలాగే బ్యాంకు ఖాతా వివరాల్లో మార్పులు, చేర్పులు చేసుకోవాలనుకునే వారు సైతం దరఖాస్తు చేసుకోవాలన్నారు. గతంలో రైతుబంధు పొందిన రైతులు మరోసారి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదన్నారు.

Similar News

News January 9, 2026

NHAI డిప్యూటీ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్

image

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (<>NHAI<<>>) 40 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఈ/బీటెక్(సివిల్) అర్హతగల వారు నేటి నుంచి ఫిబ్రవరి 9 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. గేట్ -2025 స్కోరు ఆధారంగా ఎంపిక చేయనున్నారు. బేసిక్ పే రూ.56,100-రూ.1,77,500గా ఉంది. వెబ్‌సైట్: https://nhai.gov.in/

News January 9, 2026

సిరిసిల్ల : పాఠశాలల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు

image

రేపటి నుంచి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ఉండడంతో ముందస్తు సంక్రాంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు వేసిన రంగవల్లులు ఆకట్టుకున్నాయి. పాఠశాల ప్రాంగణంలో గాలిపటాలు ఎగురవేసి సందడి చేశారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులతో అలరించారు. అనంతరం విజేతలకు బహుమతులను పంపిణీ చేశారు.

News January 9, 2026

జగిత్యాల జిల్లాలో గాలిపటాల దుకాణాలపై పోలీసుల తనిఖీలు

image

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా నిషేధిత చైనా మాంజా విక్రయాలు అరికట్టేందుకు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో గాలిపటాల దుకాణాలు, స్టేషనరీ షాపులు, తాత్కాలిక విక్రయ కేంద్రాలను తనిఖీ చేశారు. చైనా మాంజా వల్ల మనుషులు, చిన్నారులు, ద్విచక్ర వాహనదారులకు ప్రమాదం పొంచి ఉండటంతో పాటు పక్షులు, పర్యావరణానికి నష్టం కలుగుతుందన్నారు.