News August 20, 2024

రైతు రుణమాఫీపై ప్రజావాణి కార్యక్రమం: జిల్లా కలెక్టర్

image

ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రుణమాఫీ కార్యక్రమంలో రుణమాఫీ కానీ రైతులు సంబంధిత మండల కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితిష్ వి పాటిల్ తెలిపారు. భద్రాద్రి జిల్లాలోని 23 మండలాల్లో వ్యవసాయ అధికారులు రేపటి నుంచి ఈనెల 30 వరకు రుణమాఫీపై ప్రజావాణి నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు అందజేయాలన్నారు.

Similar News

News October 7, 2024

దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేసిన ముస్లిం దంపతులు

image

ఖమ్మం రూరల్: నాయుడుపేటలో ఏర్పాటుచేసిన శ్రీ కనకదుర్గ అమ్మవారిని ముస్లిం దంపతులు షేక్ సోందు- నైదాభి దర్శించుకున్నారు. అమ్మవారికి ముస్లిం దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. హిందూ దేవత అయిన దుర్గమ్మకు పూజలు నిర్వహించిన ముస్లిం దంపతులు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారని స్థానికులు తెలిపారు. కాగా షేక్ సొందు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు.

News October 7, 2024

సత్తుపల్లి: పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య

image

సత్తుపల్లి మండలం<<14289034>> రేగళ్లపాడుకి చెందిన సైద్‌పాషా సూసైడ్ <<>>చేసుకున్న విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే.. పాషా స్నేహితుడు ఖాసుబాబు వారం కిందట పాషా సెల్‌ఫోన్ నుంచి ఓ వివాహితకు కాల్ చేసి అసభ్యకరంగా మాట్లాడాడు. ఆ వివాహిత తన భర్తకి ఈ విషయం తెలియడంతో పాషా షాప్ దగ్గరకు వచ్చి అతడిపై దాడి చేశాడు. తాను చేయని తప్పుకు శిక్ష అనుభవించానని అవమానంగా భావించిన పాషా సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News October 7, 2024

న్యూజిలాండ్‌లో కొత్తగూడెం యువతికి మొదటి బహుమతి

image

న్యూజిలాండ్‌ ఆక్లాండ్‌లోని తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ ఆధ్వర్యంలో బతుకమ్మ పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో కొత్తగూడెం త్రీ ఇంక్లైన్ కార్మిక ప్రాంతానికి చెందిన చంద్రగిరి రేఖ పేర్చిన బతుకమ్మకి మొదటి బహుమతి లభించింది. న్యూజిలాండ్‌లో స్థిరపడిన తెలంగాణ చెందిన మహిళ కుటుంబాలలు పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు నిర్వహించుకున్నారు.