News February 22, 2026

రైతోత్సవం మేళా 2026ను ప్రారంభించిన: ఎంపీ

image

జిల్లాలో సేంద్రీయ‌ వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా విస్తృత కార్యక్రమాలు చేపట్టనున్నట్లు MP కేశినేని శివ‌నాథ్ ప్రకటించారు.
ఆర్గానిక్ రైతోత్సవం, నేచురల్ ఫార్మింగ్ మేళా-2026ను ఆయన విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం ప్రారంభించారు. జిల్లాలోని 16 మండలాల వారీగా 3 రోజుల సమగ్ర శిక్షణా శిబిరాలు నిర్వహించి రైతులను ఆర్గానిక్ వ్యవసాయం వైపు మళ్లించేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలిపారు.

Similar News

News February 24, 2026

భారత్ – బల్గేరియా ఫ్రెండ్షిప్ గ్రూప్.. సానా సతీశ్‌కు అరుదైన గౌరవం!

image

18వ లోక్ సభ కాలానికి సంబంధించి బల్గేరియాతో పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ ఏర్పాటయింది. ఇందులో సభ్యునిగా కాకినాడకు చెందిన రాజ్యసభ సభ్యుడు సానా సతీశ్‌ను లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా మంగళవారం నామినేట్ చేశారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలను విస్తరించేలా చర్యలు తీసుకుంటానని సానా సతీశ్ తెలిపారు. తనకు ఈ అవకాశం కల్పించిన స్పీకర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

News February 24, 2026

బాపట్ల జిల్లా కలెక్టర్ హెచ్చరిక

image

ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకే ప్రైవేట్ అంబులెన్స్ యజమానులు ఛార్జీలు వసూలు చేయాలని కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ స్పష్టం చేశారు. కలెక్టర్ కార్యాలయంలో అంబులెన్స్ రవాణా చార్జీల పోస్టర్‌ను ఆవిష్కరించి, అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫిర్యాదుల కోసం 7702806804 టోల్ ఫ్రీ నంబర్‌కు లేదా డీఎంహెచ్‌ఓ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని సూచించారు.

News February 24, 2026

తండ్రికి హెల్త్ ఎమర్జెన్సీ.. జట్టును వీడిన రింకూ

image

ఫిబ్రవరి 26న జింబాబ్వేతో సూపర్-8 పోరుకు ముందు IND బ్యాటర్ రింకూ సింగ్ జట్టును వీడారు. లివర్ క్యాన్సర్ (ఫోర్త్ స్టేజ్)తో బాధపడుతున్న ఆయన తండ్రి నోయిడాలోని ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై ఉన్నారని, ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. దీంతో రింకూ ఇవాళ ప్రాక్టీస్ చేయకుండా చెన్నై నుంచి వెళ్లారని తెలిపింది. మరి మ్యాచ్ జరిగే సమయానికి రింకూ అందుబాటులో ఉంటారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.