News December 29, 2025

రైలు ప్రమాదం.. నిలిచిన రైళ్లు

image

ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌ <<18699122>>ప్రమాదం<<>>తో ఎలమంచిలి రైల్వే స్టేషన్‌లో పొగ దట్టంగా అలుముకుంది. దీంతో పలు రైళ్లు నిలిచిపోయాయి. విశాఖ నుంచి విజయవాడ వెళ్లే రైళ్లు ఆలస్యం కానున్నాయి. అనకాపల్లి, తుని, విశాఖ తదితర రైల్వే స్టేషన్లలో పలు ట్రైన్స్ నిలిచిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు రైల్వే సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించి మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు సమాచారం. ప్రయాణికులు ప్రస్తుతం స్టేషన్‌లో ఉన్నారు.

Similar News

News January 2, 2026

వాస్తు మన సౌభాగ్యానికి తొలి మెట్టు

image

వాస్తు నియమాలు పాటించే ఇంట్లో సిరిసంపదలకు లోటుండదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. సరైన వాస్తు వల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడి, మనసులో ప్రభావవంతమైన ఆలోచనలు కలుగుతాయని అంటున్నారు. ‘ఇవి కొత్త అవకాశాలను సృష్టిస్తాయి. ఆదాయ వృద్ధికి బాటలు వేసి సకల సౌకర్యాలు, సదుపాయాలు కల్పిస్తాయి. అంతిమంగా ఇవి ఆనందాన్ని, మానసిక సంతృప్తిని అందిస్తాయి. వాస్తు అభ్యున్నతికి ఆధారం’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>

News January 2, 2026

పేదల కోసం నిలబడకుండా వెళ్లిపోయారు: భట్టి

image

TG: ఉపాధి హామీ పథకంపై సభలో మాట్లాడకుండా BRS నేతలు వెళ్లిపోవడం విచారకరమని Dy.CM భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ‘కోట్లాది మంది నిరుపేదల కోసం BRS అలియాస్ TRS నేతలు మాట్లాడాల్సింది. కానీ, వాళ్లు వారి స్వార్థ ప్రయోజనాల కోసం పేదలను వదిలేశారు. ఈ చట్టాన్ని మార్చకూడదని, పాతదే కొనసాగించాలని చాలా రాష్ట్రాలు ఏకగ్రీవ తీర్మానం చేశాయి. మనమూ అలాంటి తీర్మానం చేసి పేదల పక్షాన నిలబడదాం’ అని విజ్ఞప్తి చేశారు.

News January 2, 2026

‘ఉపాధి’కి గాంధీ పేరు కొనసాగించాలంటూ సభలో తీర్మానం

image

TG: ఉపాధి హామీ పథకంపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరిగింది. మహాత్మా గాంధీ పేరును యథాతథంగా కొనసాగించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. అలాగే కొత్తగా తెచ్చిన రూల్స్ వల్ల రాష్ట్రాలకు నష్టం కలుగుతోందన్నారు. ఉపాధి పనులకు గతంలో కేంద్రమే 100% నిధులు కేటాయించేదని, ఇప్పుడు 60-40 శాతానికి మార్చడం వల్ల రాష్ట్రాలపై ఆర్థిక భారం పడుతుందని మండిపడ్డారు. అనంతరం సభను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు.