News October 10, 2024
రైల్వేకోడూరు: రేబీస్ వ్యాధితో మహిళ మృతి

ఉమ్మడి కడప జిల్లాలో విషాద ఘటన వెలుగు చూసింది. రైల్వే కోడూరు మండలం ఎ.బుడగుంటపల్లి పంచాయతీ వికాస్ నగర్కు చెందిన పులికి మునిలక్ష్మి(35)ని ఆమె పెంచుకున్న పెంపుడు కుక్క కాటేసింది. ఈక్రమంలో ఆమెకు రేబీస్ వ్యాధి సోకింది. చికిత్స పొందుతూ గురువారం ఉదయం చనిపోయారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెంపుడు, వీధి కుక్కలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచించారు.
Similar News
News March 2, 2026
పుష్పగిరి నీళ్లలో యువకుని మృతదేహం లభ్యం

పుష్పగిరి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో నీళ్లలో ఈత కోసం దిగి గల్లంతైన చైతన్య మృతదేహం లభ్యమైంది. రిస్క్ టీం సాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు. మరో యువకుని జాడ కనిపించలేదు.
News March 2, 2026
ప్రొద్దుటూరు హాస్టళ్లో విద్యార్థి సూసైడ్.. డీఈవో ఆరా.!

పొద్దుటూరు ప్రభుత్వ ఎస్సీ హాస్టల్లో ఆదివారం రాత్రి 10వ తరగతి విద్యార్థి తలారి నరసింహులు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. డీఈవో శంషుద్దీన్ సోమవారం ఉదయం హాస్టల్ను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడారు. వార్డెన్ బ్రహ్మయ్యను విచారించారు. ఘటనకు గల కారణాలను అడిగారు. మార్చురీకి వెళ్లి విద్యార్థి మృతదేహాన్ని పరిశీలించారు. MEOలు శోభా, సావిత్రి, AMO విజయభాస్కర్ ఉన్నారు.
News March 2, 2026
ప్రొద్దుటూరు: హాస్టల్లో విద్యార్థి ఆత్మహత్య

ప్రొద్దుటూరు పట్టణంలోని SC హాస్టల్లో విద్యార్థి మృతి కలకలం రేపింది. మైలవరం మండలం కల్లుట్ల గ్రామానికి చెందిన తలారి నరసింహులు(15) 10వ తరగతి చదువుతున్నాడు. మోడంపల్లె హాస్టల్లో ఉంటున్నాడు. ఏమైందో ఏమో రాత్రి హాస్టల్ ఆవరణలోని చెట్టుకు ఉరి వేసుకున్నాడు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. 2టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.


