News March 24, 2024
రైల్వే కోడూరు జనసేన అభ్యర్థిగా డాక్టర్ భాస్కరరావు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1711297608133-normal-WIFI.webp)
రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రైల్వే కోడూరు కూటమి అభ్యర్థిగా డాక్టర్ యనమల భాస్కరరావును జనసేన పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. తాజాగా జనసేన పార్టీ తన పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటిస్తూ జాబితాని విడుదల చేసింది. ఇందులో ఎస్సీ రిజర్వుడు అయిన రైల్వే కోడూరు నియోజకవర్గానికి డాక్టర్ భాస్కర్ రావును ఎంపిక చేస్తూ, ఆయన విజయం కోసం జనసేన టీడీపీ శ్రేణులు పనిచేయాలని కోరారు.
Similar News
News July 3, 2024
కడప: రైలు కింద పడి ASI ఆత్మహత్య
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719975674764-normal-WIFI.webp)
కడప జిల్లా కమలాపురం పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తున్న నాగార్జున రెడ్డి బుధవారం గంగాయపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన కమలాపురం పోలీస్ స్టేషన్ ఏఎస్ఐగా విధులు నిర్వర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News July 3, 2024
కడప: 5 నుంచి తిరుమల ఎక్స్ప్రెస్ రద్దు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719960023151-normal-WIFI.webp)
కడప-విశాఖపట్నం-కడప మధ్య నడుస్తున్న తిరుమల ఎక్స్ప్రెస్ రైలును ఈనెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు రద్దు చేసినట్లు కడప రైల్వే సీనియర్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలోని మూడో ప్లాట్ఫారం నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్న కారణంగా రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని సూచించారు.
News July 3, 2024
ఖాజీపేట హైస్కూల్ ఇన్ఛార్జ్ హెచ్ఎం సస్పెండ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719960808774-normal-WIFI.webp)
ఖాజీపేటలోని బాలికల ఉన్నత పాఠశాలలో కలుషిత నీరు తాగి 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ విషయానికి సంబంధించి పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవిని సస్పెండ్ చేసినట్లు డీఈవో అనురాధ తెలిపారు. దీంతోపాటు ఖాజీపేట ఎంఈఓ-1 నాగ స్వర్ణలత, ఎంఈఓ-2 నాగరాజుకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. నీటి ట్యాంకుల శుభ్రతలో ఇన్ఛార్జ్ హెచ్ఎం నిర్లక్ష్యం వల్లే నీరు కలుషితమైందన్నారు.