News March 3, 2025

రైల్వే డివిజన్ ఏర్పాటుపై కేంద్ర మంత్రిని కలుస్తా:MP కావ్య

image

ఉమ్మడి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానిరి కృషి చేస్తున్నామని ఎంపీ కడియం కావ్య అన్నారు. హనుమకొండలో ఎంపీ మాట్లాడారు. రైల్వే సమస్యల పరిష్కార దిశగా కృషి చేస్తానని పేర్కొన్నారు. , ల్వే డివిజన్ ఏర్పాటు విషయంపై కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలుస్తానని చెప్పారు.

Similar News

News December 15, 2025

క్యాబేజీలో రెక్కల పురుగు నివారణకు సూచనలు

image

క్యాబేజీలో రెక్కల పురుగు లార్వాలు ఆకుల అడుగు భాగాన చేరి తినడం వల్ల ఆకులు వాడి ఎండిపోతాయి. వీటి ఉద్ధృతి ఎక్కువైతే ఆకులకు రంధ్రాలు పడి క్యాబేజీ పరిమాణం తగ్గుతుంది. దీని నివారణకు ప్రతి 25 క్యాబేజీ వరుసలకు 2 వరుసల ఆవ మొక్కలను ఎర పంటగా నాటాలి. రెక్కల పురుగు గుడ్లను నాశనం చేసేందుకు 5% వేపగింజల ద్రావణాన్ని, ఉద్ధృతి మరీ ఎక్కువైతే లీటరు నీటికి నోవాల్యురాన్1ml కలిపి కోతకు 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.

News December 15, 2025

లిక్కర్ స్కామ్ కేసు: SC విచారణ జనవరి 21కి వాయిదా

image

ఏపీ అక్రమ మద్యం కేసులో గోవిందప్ప, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను SC విచారించింది. వారికి సరెండర్ నుంచి ఇచ్చిన మినహాయింపును జనవరి 21 వరకు పొడిగించి తదుపరి విచారణను అదే తేదీకి వాయిదా వేసింది. ఈమేరకు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. ట్రయల్ కోర్టు ఛార్జిషీట్‌ను కాగ్నిజెన్స్‌లోకి తీసుకునేందుకు తమ ఉత్తర్వులు అడ్డంకి కాబోవని స్పష్టం చేసింది.

News December 15, 2025

ములుగు: భార్య సర్పంచ్.. భర్త వార్డు మెంబర్..!

image

రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ములుగు మండలం ఖాసీందేవిపేట సర్పంచ్‌గా వాంకుడోతు నిరోషా గెలిచారు. ఆమె భర్త అమర్ సింగ్ 6వ వార్డు నుంచి వార్డు సభ్యుడిగా విజయం సాధించారు. ఒకే పంచాయతీ కార్యవర్గంలో భార్య సర్పంచ్‌గా, భర్త వార్డు సభ్యుడిగా ఉండటంతో సర్వత్రా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అమర్ సింగ్ కాకతీయ విశ్వ విద్యాలయం నుంచి ఎకనామిక్స్‌లో డాక్టరేట్ పొందారు.