News October 31, 2025

రైల్వే స్టేషన్లలో ప్యాసింజర్ హోల్డింగ్ ఏరియాలు

image

TGలోని SECBAD, కాచిగూడ, APలోని విజయవాడ, TPT, రాజమండ్రి, GNTతో పాటు దేశంలో 76 స్టేషన్లలో ప్యాసింజర్ హోల్డింగ్ ఏరియాలు ఏర్పాటు చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. మహా కుంభమేళా వేళ ఢిల్లీ స్టేషన్‌లో తొక్కిసలాట అనంతరం రద్దీని నియంత్రించేందుకు అక్కడ ‘యాత్రి సువిధ కేంద్ర’ను అభివృద్ధి చేశారు. ఇందులో టికెట్ కౌంటర్‌తో పాటు ప్రయాణికులు వేచి ఉండేలా వసతులు కల్పించారు. ఇదే మోడల్‌ను దేశవ్యాప్తంగా అమలు చేస్తారు.

Similar News

News October 31, 2025

రూ.1,032 కోట్ల బకాయిలు, బిల్లులు విడుదల

image

TG: ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు, పంచాయతీరాజ్, R&B శాఖల పెండింగ్ బిల్లులకు సంబంధించి రూ.1,032 కోట్లను ఆర్థికశాఖ విడుదల చేసింది. పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బకాయిలను దశలవారీగా ప్రతినెలా Dy.CM భట్టి క్లియర్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా OCT నెలకు సంబంధించి ఉద్యోగుల బకాయిలు రూ.712 కోట్లు, పంచాయతీరాజ్ R&Bకి రూ.320 కోట్లు విడుదల చేశారు. దీంతో రూ.10లక్షల లోపు ఉన్న పెండింగ్ బిల్లులు క్లియర్ కానున్నాయి.

News October 31, 2025

2,162 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

RRC నార్త్ వెస్ట్రర్న్ రైల్వేలో 2,162 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. టెన్త్, ఐటీఐ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.100, SC, ST, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://rrcjaipur.in

News October 31, 2025

మళ్లీ పెరిగిన బంగారం ధరలు!

image

బంగారం ధరలు గంటల వ్యవధిలోనే <<18156666>>మరోసారి<<>> పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ ఇవాళ మొత్తంగా రూ.1,800 పెరిగి ₹1,23,280కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,650కు ఎగబాకి రూ.1,13,000 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.1,65,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.