News March 4, 2025
రైళ్ల ద్వారా పెనుకొండ కియా కార్ల ఎగుమతి

పెనుకొండలోని కియా ఇండియా ప్లాంట్లో తయారైన కార్లు రైలు ద్వారా ఎగుమతి అవుతున్నాయి. మంగళవారం ఆ సంస్థ సెల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ హర్దీప్ సింగ్ జెండా ఊపి రైలును ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా డబుల్ డెక్కర్ రైలులో కార్లను మార్కెటింగ్ చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు రైల్వే ద్వారా 60 వేల కార్లను ఎగుమతి చేశామన్నారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
Similar News
News September 17, 2025
తుంగతుర్తి: మల్లు స్వరాజ్యం మాటే తూటాలు

పదహారేళ్ల వయసులోనే తుపాకీ పట్టి దొరలపై తిరుగుబాటు చేసిన వీర వనిత మల్లు స్వరాజ్యం. ఆమె తన సోదరుడు భీంరెడ్డి నర్సింహారెడ్డితో కలిసి సాయుధ పోరాటంలో దిగారు. నైజాం సర్కారును గడగడలాడించారు. సాయుధ పోరాటంలో మల్లు స్వరాజ్యం మాటలు, ఆమె పాడిన బతుకమ్మ పాటలే తూటాలై పేలాయి. నైజాములను గడగడలాడించినయి. ఆమె స్ఫూర్తితో ఎంతో మంది ధీర వనితలు పోరాటంలో నడుం బిగించారు.
News September 17, 2025
రాష్ట్రవ్యాప్తంగా IT అధికారుల సోదాలు

TG: హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో IT అధికారులు సోదాలు చేస్తున్నారు. ప్రముఖ బంగారు దుకాణాల యజమానులే లక్ష్యంగా వారి ఇళ్లలో తనిఖీలు జరుగుతున్నాయి. బంగారం లావాదేవీలు, ట్యాక్స్ చెల్లింపుల్లో అవకతవకలపై సోదాలు చేస్తున్నట్లు సమాచారం. వరంగల్లోనూ తెల్లవారుజాము నుంచే ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
News September 17, 2025
చంద్రగిరి కోటలో కూలిన కోనేరు ప్రహరీ

భారీ వర్షానికి చంద్రగిరి కోటలోని పురాతన కోనేరు ప్రహరీ కూలింది. గతంలో ఈ కోనేరులో ఏపీ టూరిజం ఆధ్వర్యంలో బోటింగ్ నిర్వహిస్తుండేవారు. తర్వాత బోటింగ్ నిలిపివేశారు. ఆర్కియాలజీ అధికారి బాలకృష్ణారెడ్డి కోనేరు గోడను పరిశీలించారు. అధికారులకు దీనిపై నివేదిక పంపనున్నట్లు తెలిపారు. వర్షం ఎక్కువగా పడటంతోనే కోనేరు గోడ కూలిందని పురావస్తు శాఖ అధికారులు నిర్ధారించారు.