News January 28, 2026

రొమ్ముల్లో గడ్డలున్నాయా?

image

సాధారణంగా రొమ్ములో ఏవైనా గడ్డలుంటే చాలామంది బ్రెస్ట్ క్యాన్సర్ అని భయపడతారు. కానీ రొమ్ములో కొన్నిసార్లు అపాయంలేని గడ్డలు ఏర్పడతాయంటున్నారు నిపుణులు. దీన్నే ఫైబ్రోఎడినోమా అంటారు. వీటివల్ల ప్రాణాపాయం ఉండదు కానీ రొమ్ములో ఏదైనా అసాధారణంగా అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. 15-30 ఏళ్ల మధ్యలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. వీటి సైజ్ బాగా ఎక్కువగా ఉంటే ఆపరేషన్‌ చెయ్యాల్సుంటుంది.

Similar News

News February 5, 2026

ఐఐటీ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు

image

<>ఐఐటీ<<>> హైదరాబాద్ 4 ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అటెండెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గలవారు FEB 13వరకు అప్లై చేసుకోవచ్చు. బీటెక్, ఇంటర్ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. ప్రాజెక్ట్ అసోసియేట్‌కు రూ.25K-రూ.35Kవరకు, ప్రాజెక్ట్ అటెండెంట్‌కు రూ.20K-రూ.25K వరకు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://iith.ac.in

News February 5, 2026

స్వర్ణ వార్డు, గ్రామ సిబ్బందికి త్వరలో ప్రమోషన్లు

image

AP: స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ ఉద్యోగులకు త్వరలోనే పదోన్నతులు దక్కనున్నాయి. అర్హతలు, సీనియార్టీ, పనితీరు ఆధారంగా ప్రభుత్వం వీరికి ప్రమోషన్లు ఇవ్వనుంది. అలాగే రేషనలైజేషన్ పూర్తి చేసి ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల్లో వీరిని నియమించాలని భావిస్తోంది. ఆఫీసుల పర్యవేక్షణకు జిల్లా, మండల స్థాయి అధికారులను నియమించనుంది. దీనివల్ల ఉద్యోగులకు మేలు చేకూరి ప్రజలకు నాణ్యమైన సేవలందుతాయని భావిస్తోంది.

News February 5, 2026

వ్యవసాయ రంగం అంటే చంద్రబాబుకు చిన్నచూపు: సజ్జల

image

AP: వ్యవసాయ రంగంపై చంద్రబాబుకు చిన్నచూపు ఉందని YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయడం రాయలసీమకే కాకుండా రాష్ట్రానికే ఘోర అన్యాయమన్నారు. చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ పథకాన్ని అడ్డుకున్నారని ఆరోపించారు. YCP నిర్వహించిన ఛలో పోతిరెడ్డిపాడు కార్యక్రమంలో సజ్జలతో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు.