News October 15, 2025
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. ఇద్దరికి గాయాలు

పాలకొల్లు-దిగమర్రు రహదారిపై బైకును ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టిన ఘటనలో మంగళవారం ఒకరు మృతి చెందగా, ఇరువురు గాయపడ్డారు. క్షతగాత్రులు శరణ్ శర్మ, సాయి చరణ్ను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరు పేరుపాలెం వెళ్తున్నట్లు సమాచారం. యువకులు తణుకుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో కొల్లి మహేష్ రాజు(18) మృతి చెందాడు.
Similar News
News October 15, 2025
రెండేళ్లలో 3.5 కోట్లకు పైగా ఉద్యోగాలే లక్ష్యం: కలెక్టర్

భీమవరం కలెక్టరేట్లో కలెక్టర్ చదలవాడ నాగరాణి పీఎంవీబీఆర్వై పథకం అమలుపై సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్ఘర్ యోజన పథకాన్ని భారత ప్రధాని 1ఆగస్టు2025న ప్రారంభించారన్నారు. రెండు సంవత్సరాలలో యువతకు 3.5 కోట్లకు పైగా ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ప్రోత్సాహకాలను అందించనున్నట్లు తెలిపారు.
News October 14, 2025
ఆదర్శ గ్రామాలలో పనులు చేపడతాం: కలెక్టర్

భీమవరం కలెక్టరేట్లో కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద గ్రామాల అభివృద్ధి ప్రణాళికపై సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్షించారు. జిల్లాలో మొదటి విడతలో 11, రెండో విడతలో 14 గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా ఎంపిక చేస్తామన్నారు. మొదటి విడత 11 గ్రామాలకు బడ్జెట్ను కేటాయిస్తామన్నారు. ఆయా గ్రామాల్లో పనులను చేపట్టి అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
News October 14, 2025
ఆకివీడు: రైలు నుంచి జారిపడి వృద్ధుడు మృతి

ఆకివీడు – పల్లెవాడ రైల్వే స్టేషన్ల మధ్య సోమవారం గుర్తు తెలియని వృద్ధుడు (సుమారు 60 సం.) రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. మృతుడిని గుర్తించిన వారు లేదా వివరాలు తెలిసిన వారు రైటర్ రాజాబాబు (9705649492) కి తెలపాలని జీఆర్పీఎఫ్ ఎస్ఐ సుబ్రహ్మణ్యం కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.