News February 22, 2025
రోడ్డు ప్రమాదంలో బాన్సువాడ వాసి మృతి

రోడ్డుప్రమాదంలో బాన్సువాడ వాసి మృతిచెందారు. స్థానికుల కథనం ప్రకారం.. బాన్సువాడ మండలం వినాయకనగర్ కాలనీకి చెందిన సందీప్(33)
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి మండల తహశీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. శుక్రవారం రాత్రి ఇంటికి వెళ్లే క్రమంలో బైక్ అదుపుతప్పి ఒక్కసారిగా డివైడర్ను ఢీకొట్టింది. ప్రమాదంలో సందీప్ అక్కడికక్కడే మృతిచెందారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Similar News
News July 4, 2025
పాలమూరు: కొత్త రేషన్ కార్డ్.. ఇలా చేయండి!

ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొత్త రేషన్ కార్డుల మంజూరు, పేర్లు చేర్చడంపై అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. మీ సేవలో దరఖాస్తు చేసుకున్న అనంతరం రెవెన్యూ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా వివాహమైన వారు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయాలంటే మొదట సంబంధిత తహశీల్దార్ కార్యాలయాలకు వెళ్లి తల్లిదండ్రుల కార్డుల నుంచి పేర్లను తొలగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
News July 4, 2025
ఇసుక అక్రమ తవ్వకాలను పూర్తిగా అరికట్టాలి: కలెక్టర్

అక్రమ ఇసుక తవ్వకాలు పూర్తిగా అరికట్టాలని కమిటీ సభ్యులకు కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. అమలాపురంలోని కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా స్థాయి ఇసుక కమిటీ సభ్యులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ప్రస్తుత వర్షాకాలంలో స్టాక్ యార్డుల ద్వారా ఇసుక విక్రయాలు నిర్వహణ కోసం పటిష్టమైన ఏర్పాట్లను చేపట్టాలని ఆదేశించారు.
News July 4, 2025
పాడేరులో మన్యం వీరుడి జయంతి ఉత్సవాలు

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి శుక్రవారం పాడేరు కలెక్టరేట్లో ఘనంగా జరగింది. కలెక్టర్ దినేశ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, చిత్ర ప్రదర్శన ప్రజలను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ శర్మన్ పటేల్, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.