News February 27, 2025

రోడ్డు ప్రమాదంలో రాజమండ్రి వాసి మృతి 

image

కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా కొర్రపాటి నాగ మురళి శివప్రసాద్ (45) అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో బుధవారం మృతి చెందాడు. దీంతో ఆయన నివాస ప్రాంతo అన్నపూర్ణమ్మ పేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆటో డ్రైవర్‌గా ఉన్న శివప్రసాద్ గత వారం కుంభమేళాకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో బీహార్‌లోని గయలో రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నేడు రాజమండ్రికి ఆయన భౌతికకాయం రానుంది.

Similar News

News February 17, 2026

వికసిత్ భారత్‌కు బడ్జెట్-2026 బలమైన పునాది: పురందేశ్వరి

image

2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు కేంద్ర బడ్జెట్-2026 దీర్ఘకాలిక పునాది వేస్తుందని ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి అన్నారు. మంగళవారం రాజమండ్రిలో నిర్వహించిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలో జరుగుతున్న దేశాభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

News February 17, 2026

JEE మెయిన్స్‌లో ‘తిరుమల’ విద్యార్థుల జయకేతనం

image

JEE MAIN 2026 సెషన్-1 ఫలితాలలో రాజమహేంద్రవరంలోని TIRUMALA IIT & అండ్ మెడికల్ విద్యార్థి డి.శ్రీవేద్ 99.999 పర్సంటైల్ సాధించారు. SC కేటగిరిలో శ్రీవేద్ ఆలిండియా టాపర్‌గా నిలిచారని TIRUMALA విద్యాసంస్థల ఛైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు. అలాగే ఎం.కృష్ణ శరవణ సాకేత్ 99.99, జీ.వాత్సల్యకు 99.98, ఆర్.చరణ్ తేజ 99.98 పర్సంటైల్ సాధించారన్నారు. ఉత్తమ స్కోర్లను సాధించినవారిని ఆయన అభినందించారు.

News February 17, 2026

బీజేపీ పథకాలు ప్రతి గడపకూ చేరాలి: పురందీశ్వరి

image

తూర్పు గోదావరి జిల్లా BJP కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మైనారిటీ, ఎస్సీ మోర్చా సమావేశంలో MP పురందీశ్వరి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఎస్సీ, మైనారిటీ వర్గాల సాధికారత, ఆర్థిక పురోగతికి మోదీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా మోర్చా నాయకులు క్షేత్రస్థాయిలో కృషి చేయాలని ఆమె సూచించారు.