News October 8, 2025
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

కుప్పం – పలమనేరు జాతీయ రహదారిలోని సామగుట్టు పల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందాడు. ద్విచక్ర వాహనాన్ని బొలెరో వాహనం ఢీకొనడంతో కుప్పం మండలం నూలుకుంట కు చెందిన వెంకటేష్ తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News October 7, 2025
కల్తీ మద్యం.. ములకలచెరువు ఎక్సైజ్ సీఐపై వేటు

ములకలచెరువు ఎక్సైజ్ సీఐ హిమబిందుపై వేటు పడింది. ఇటీవల నకిలీ మద్యం తయారీ స్థావరాన్ని పోలీసులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ మద్యం తయారీ స్థావరాన్ని గుర్తించడంలో అలసత్వం వహించారనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆమెను విజయవాడ ఎక్సైజ్ కమిషనర్ ఆఫీసుకు అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. లక్కిరెడ్డిపల్లె ఎక్సైజ్ సీఐ కిషోర్ ములకలచెరువు ఎక్సైజ్ సీఐ బాధ్యతలు చేపట్టనున్నారు.
News October 7, 2025
చిత్తూరు: ధరలు తగ్గింపు పై అవగాహన కల్పించాలి

సూపర్ జీఎస్టీతో తగ్గిన ధరలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం ఆదేశించారు. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో తాగునీటి సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలన్నారు. ఓవర్ హెడ్ ట్యాంకులు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. వ్యాధుల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
News October 7, 2025
చిత్తూరు: వర్షాలు ఎఫెక్ట్.. విద్యుత్ శాఖకు భారీ నష్టం

జిల్లాలోని వర్షం కారణంగా పలు ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినడంతో విద్యుత్ శాఖకు రూ.5 లక్షల నష్టం వాటిల్లింది. పిడుగుపాటుకు చిత్తూరు జిల్లాలో 14 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. 25 విద్యుత్ స్తంభాలు ధ్వంసం అయ్యాయి. యుద్ధ ప్రాతిపదికన వీటి మరమ్మతులు నిర్వహిస్తున్నట్లు విద్యుత్ శాఖా అధికారి ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు.