News February 8, 2025

రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

<<15391662>>కర్మకు వెళ్లి వస్తుండగా<<>> బూడిదంపాడు వద్ద రోడ్డు ప్రమాదంలో వీరబాబు, విజయ్‌ మృతి చెందిన విషయం తెలిసిందే. విజయ్‌కు భార్య, 3 కుమారులు, వీరబాబుకు భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. వీరబాబు మొదటి భార్యకు కుమార్తె జన్మించాక 8ఏళ్ల క్రితం కన్నుమూయడంతో మరో వివాహం చేసుకున్నాడు. కుమార్తెకు పెళ్లి నిశ్చయం కాగా ఇటీవలే ముహూర్తాలు కూడా ఖరారు చేసుకున్నారు. ఇంతలోనే ఆయన మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

Similar News

News November 11, 2025

అధిక పాలిచ్చే పశువును ఎలా గుర్తించాలి?(1/2

image

పాడి ద్వారా ఎక్కువ ఆదాయం రావాలంటే మనం కొనే పశువు ప్రతి 14 నుంచి 15 నెలలకు ఒకసారి ఈనేట్లు ఉండాలి. పాడి పశువు పాలసార గురించి తెలుసుకోవాలంటే ఆ పశువు పొదుగును గమనించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు. పొదుగు పెద్దదిగా ఉండి, శరీరంలో కలిసినట్లుగా ఉండాలి. అలాకాకుండా పొదుగు వేళ్లాడుతూ, జారిపోతున్నట్లుగా ఉండకూడదు. నాలుగు పాలసిరల (చనుమొనలు) అమరిక చతురస్రాకారంగా ఉండి, అన్నింటి నుంచి పాలు సులువుగా వస్తుండాలి.

News November 11, 2025

అధిక పాలిచ్చే పాడి పశువును ఎలా గుర్తించాలి?(2/2)

image

పాడి పశువు నుంచి పాలు పిండిన తర్వాత పొదుగు ఒక రబ్బరు బుడగ గాలి తీసివేస్తే ఎలా అవుతుందో అలా అయిపోవాలి. అలా అవ్వని పొదుగును కండపొదుగు అంటారు. ఇది అధిక పాల దిగుబడికి పనికిరాదు. అంతేకాక పొదుగు మీద కనపడే రక్తనాళాలను గమనించాలి. వీటిని పాల సిరలు అంటారు. ఇవి పెద్దవిగా, ఎక్కువ పొడవుగా ఉండాలి. అలా ఉంటే పొదుగుకు అధిక రక్త సరఫరా జరిగి, పాల దిగుబడి పెరుగుతుంది. పొదుగు మీద చర్మం కూడా పలుచగా ఉండాలి.

News November 11, 2025

తుఫాను సాయంగా ₹2622 కోట్లు ఇవ్వాలి: AP

image

AP: మొంథా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం CM CBNతో భేటీ అయింది. రాష్ట్రం ప్రభుత్వం అందించిన నివేదికలపై చర్చించింది. ₹5267 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొన్న ప్రభుత్వం తక్షణ సాయంగా ₹2622 కోట్లు ఇవ్వాలని నివేదించింది. తుఫాను సమయంలో 22 జిల్లాల్లో 1.92 లక్షల మందికి రిలీఫ్ క్యాంపుల్లో ఆశ్రయం కల్పించామని వివరించింది. 3.36 లక్షల కుటుంబాలకు రూ.3 వేల చొప్పున అందించినట్టు తెలిపింది.