News February 8, 2025
రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

<<15391662>>కర్మకు వెళ్లి వస్తుండగా<<>> బూడిదంపాడు వద్ద రోడ్డు ప్రమాదంలో వీరబాబు, విజయ్ మృతి చెందిన విషయం తెలిసిందే. విజయ్కు భార్య, 3 కుమారులు, వీరబాబుకు భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. వీరబాబు మొదటి భార్యకు కుమార్తె జన్మించాక 8ఏళ్ల క్రితం కన్నుమూయడంతో మరో వివాహం చేసుకున్నాడు. కుమార్తెకు పెళ్లి నిశ్చయం కాగా ఇటీవలే ముహూర్తాలు కూడా ఖరారు చేసుకున్నారు. ఇంతలోనే ఆయన మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.
Similar News
News September 18, 2025
జనగామ జిల్లాలో నిరుద్యోగుల నిరీక్షణ!

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తామని చెప్పిన రాజీవ్ యువ వికాసం పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా రూ.50వేల యూనిట్లను కేటాయిస్తామని చెప్పిన ప్రభుత్వం నెలలు గడుస్తున్నా యూనిట్లు కేటాయించకపోవడంతో నిరుద్యోగులు నిరాశ చెందుతున్నారు. జనగామ జిల్లాలో 32వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో యువత ఆశలు సన్నగిల్లుతున్నాయి.
News September 18, 2025
అర్హులైన వారెవరికీ పెన్షన్లు తొలగించలేదు: మంత్రి

AP: రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ప్రభుత్వం పెన్షన్లు ఇస్తోందని శాసనమండలిలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. అర్హులైన వారెవరికీ పెన్షన్లు తొలగించలేదని, నోటీసులు అందిన వారికి 2 నెలల్లో వెరిఫికేషన్ పూర్తిచేయాలని వైద్యశాఖకు చెప్పామన్నారు. లబ్ధిదారులు చనిపోతే వారి ఫ్యామిలీలో మరొకరికి పెన్షన్ ఇస్తున్నట్లు తెలిపారు. 50-59 ఏళ్ల వయసున్న వారిలో 11.98 లక్షల మంది పెన్షన్ పొందుతున్నారని చెప్పారు.
News September 18, 2025
ఇది కోట ‘కుక్కల’ బస్టాండ్..!

గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఇటీవల కుక్కల బెడద ఎక్కువైంది. గుంపులు గుంపులుగా తిరుగుతూ మనుషులను భయపెడుతున్నాయి. దీనికి పైఫొటోనే నిదర్శనం. తిరుపతి జిల్లా కోటలోని RTC బస్టాండ్ లోపల ఇలా పదుల సంఖ్యలో కుక్కలు దర్శనమిచ్చాయి. ఇక్కడ సమయానికి బస్సులు వస్తాయో లేదో తెలియదు గానీ రాత్రి అయితే కుక్కలు ఇలా వచ్చేస్తాయి. పగటి పూట రోడ్లపై వెళ్లే వారిపై దాడులు చేస్తూ కరుస్తున్నాయి.