News December 19, 2025

​రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు: హనుమకొండ కలెక్టర్

image

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ (DRSC) సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే ‘బ్లాక్ స్పాట్స్’ను గుర్తించి, అక్కడ రంబుల్ స్ట్రిప్స్, సైన్ బోర్డులు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పోలీస్, రవాణా అధికారులు పాల్గొన్నారు.

Similar News

News December 22, 2025

నెల రోజుల్లో భారీగా పెరిగిన చికెన్ ధరలు

image

TG: కోడిగుడ్ల <<18636145>>ధరలతో<<>> పాటు చికెన్ ధరలు కూడా భారీగా పెరిగాయి. కార్తీక మాసం తర్వాత నెల రోజుల వ్యవధిలోనే చికెన్ సెంటర్ల నిర్వాహకులు పలు చోట్ల ఏకంగా రూ.100 పెంచి అమ్మకాలు కొనసాగిస్తున్నారు. నెల కిందటి వరకు రూ.210-220 ఉండగా ఇప్పుడు రూ.300కు చేరింది. న్యూఇయర్ వరకు రూ.330కి చేరవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు పడిపోవడం, ఉత్పత్తి తగ్గడం, దాణా ఖర్చులు పెరగడమే దీనికి కారణమని అంటున్నారు.

News December 22, 2025

తూ.గో: బ్యాగు నుంచి సౌండ్.. ప్రయాణికుల పరుగులు

image

నిడదవోలు-భీమవరం ప్యాసింజర్ రైలులో ఆదివారం ఓ బ్యాగు కలకలం సృష్టించింది. సీటు కింద ఉన్న సంచి నుంచి బీప్ సౌండ్ రావడంతో ప్రయాణికులు బాంబుగా భావించి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఆర్పీఎఫ్ పోలీసులు బ్యాగును తనిఖీ చేయగా, అందులో ‘ఫోన్ పే’ సౌండ్ బాక్స్, బిర్యానీ ప్యాకెట్, దుస్తులు ఉన్నట్లు గుర్తించారు. దొంగతనం చేసిన వ్యక్తి ఆ బ్యాగును రైలులో వదిలి వెళ్లి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

News December 22, 2025

యూరియా బుకింగ్ ఇక యాప్‌తో మాత్రమే

image

TG: యూరియా పొందాలంటే రైతులు నేటి నుంచి Fertilizer Booking Appతో మాత్రమే బుక్ చేసుకోవాలి. ఈనెల 20 నుంచి కొన్ని జిల్లాల్లో ఈ విధానం అందుబాటులోకి రాగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇకపై ఇదే విధానం అమలుకానుంది. పారదర్శకంగా, నిజమైన లబ్ధిదారులకే యూరియా పంపిణీకి ఈ విధానం తెచ్చామని ప్రభుత్వం తెలిపింది. యాప్ ద్వారా యూరియా ఎలా బుక్ చేసుకోవాలి?, ఏ పంటకు ఎన్ని బస్తాలు ఇస్తారో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.