News January 24, 2026
రోడ్డు భద్రతా నియమాలు తప్పక పాటించాలి: NLG ఎస్పీ

జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం నల్గొండ ఆర్టీసీ డిపోలో ఆర్ఎం కె.జాన్ రెడ్డి ఆధ్వర్యంలో రీజియన్ స్థాయిలో ముగింపు ఉత్సవాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హాజరై మాట్లాడుతూ.. ప్రయాణంలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను, నిబంధనలను వివరించారు. ఈ కార్యక్రమంలో రవాణాశాఖ అధికారులు, ఆర్టీసీ ఉన్నతాధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 17, 2026
పాలపళ్లను శుభ్రం చేస్తున్నారా?

పాలపళ్లు ఊడిపోయేవే కదా అని చాలామంది పేరెంట్స్ వాటిపై శ్రద్ధ చూపరు. కానీ ఇవి నోటి నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తాయంటున్నారు నిపుణులు. ఇవి దవడ ఎముక వృద్ధి చెందటానికి మార్గం చూపించడంతో పాటు శాశ్వత దంతాలకు అవసరమైన చోటును కల్పిస్తాయి. తొలి దంతం రావటానికి ముందు నుంచే శిశువుల నోటిని శుభ్రం చేయాలని చెబుతున్నారు. రోజుకు రెండుసార్లు బట్టతో/మెత్తటి బ్రష్తో శుభ్రం చేయాలని సూచిస్తున్నారు.
News February 17, 2026
FLASH.. తొర్రూరులో ఛైర్మన్ ఎన్నికకు లక్కీ డ్రా తీసే అవకాశం?

తొర్రూరు మున్సిపాలిటీ బాధ్యతలను ఎంపీ రఘురామరెడ్డి, MLAలు రాజేందర్ రెడ్డి, నాగరాజుకు TPCC అప్పగించారు. అయితే, ఇప్పటికే BRSకు 9 మంది కౌన్సిలర్లు ఉండగా.. ఎక్స్ అఫిషియోతో కలిపి కాంగ్రెస్కు 9 మంది అయ్యారు. రెండు పార్టీలకు సమాన బలం ఉండటంతో ఛైర్మన్ ఎన్నికకు లక్కీ డ్రా తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిన్నటి ఘర్షణల నేపథ్యంలో తొర్రూరులో BNS-163 సెక్షన్ అమలు చేశారు. దాదాపు వెయ్యి మంది పోలసులు మోహరించారు.
News February 17, 2026
నారాయణపేట: ఏళ్ల కల నిజమైన వేళ!

ఏడేళ్ల క్రితం NRPT జిల్లావాసుల ఎదురుచూపులకి తెరపడింది. సొంత జిల్లా కోసం ప్రజలు సాగించిన దీర్ఘకాల పోరాటం విజయవంతమైంది. MBNR విభజన తర్వాత ర్యాలీలు, బంద్లు, ఆమరణ దీక్షలతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. “మాకు మా జిల్లా కావాలి” నినాదంతో విద్యార్థులు, నేతన్నలు, వ్యాపారులు ఒక్కటయ్యారు. ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ అప్పటి CM KCR ప్రభుత్వం 2019 ఫిబ్రవరి 17న జిల్లా ప్రకటించగా పట్టణం సంబరాల్లో మునిగిపోయింది.


