News January 25, 2026

రోహిత్ శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్‌కు పద్మశ్రీ అవార్డ్స్

image

ఈ ఏడాది క్రీడల రంగంలో 8 మందికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. క్రికెట్‌లో రోహిత్ శర్మతో పాటు హర్మన్‌ప్రీత్ కౌర్‌కు లభించాయి. అలాగే మహిళల హాకీ గోల్‌కీపర్ సవితా పునియా, అథ్లెట్ ప్రవీణ్ కుమార్‌, పంజాబ్‌కు చెందిన బల్దేవ్ సింగ్, MP నుంచి భగవాన్‌దాస్ రైక్వార్, పుదుచ్చేరి కె.పజనివేల్‌ను అవార్డులు వరించాయి. జార్జియాకు చెందిన వ్లాదిమిర్ మెస్త్విరిష్విలికి మరణానంతరం పద్మశ్రీ ప్రకటించారు.

Similar News

News January 28, 2026

అలసంద మొక్కల ఆకులను పురుగులు తినేస్తున్నాయా?

image

అలసంద పంటను ఆకు తినే పురుగులు ఎక్కువగా ఆశిస్తాయి. ఈ పురుగులు ఆకులను తినేయడం వల్ల మొక్కల ఎదుగుదల లోపిస్తుంది. వీటి తీవ్రత పెరిగితే దిగుబడిపై కూడా ప్రభావం పడుతుంది. ఈ పురుగుల నివారణకు లీటరు నీటికి 5ml వేప గింజల కషాయాన్ని లేదా లీటరు నీటికి 3ml అజాడిరక్టిన్ (3000 PPM) చొప్పున కలిపి పంటపై పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

News January 28, 2026

AP క్యాబినెట్ నిర్ణయాలు

image

* అర్జున అవార్డు గ్రహీత, అథ్లెట్ జ్యోతికి విశాఖలో 500 చ.గజాల స్థలం, డిగ్రీ తర్వాత గ్రూప్-1 జాబ్
* ఏపీ టిడ్కోకు హడ్కో నుంచి రూ.4,451 కోట్ల రుణానికి ప్రభుత్వ గ్యారంటీ
* అమరావతిలో వీధిపోటు స్థలాలు పొందిన రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లు.. అమరావతి పరిధిలో అనాథలకు, భూమి లేని పేదలకు పెన్షన్లు
* అల్లూరి జిల్లా నందకోటలో పర్యాటక శాఖ ఫైవ్‌స్టార్ రిసార్ట్ ఏర్పాటుకు భూ కేటాయింపు

News January 28, 2026

ఏపీ జంగిల్ రాజ్‌గా మారింది: వైఎస్ జగన్

image

AP: రాష్ట్రం జంగిల్ రాజ్‌గా మారిందని YCP చీఫ్ జగన్ ధ్వజమెత్తారు. ‘ప్రభుత్వ ఉద్యోగిని రైల్వే కోడూరు MLA వేధించారు. MLAలు రవికుమార్, ఆదిమూలం అలాగే ప్రవర్తించారు. కూటమి నేతలు దగ్గరుండి బెల్టు షాపులు నడిపిస్తున్నారు. సంక్రాంతి కోడిపందేలకు వేలం పెట్టారు. GOVT దగ్గరుండి అన్నీ చేయిస్తోంది’ అని దుయ్యబట్టారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంటు స్కీమ్‌లను నిర్వీర్యం చేశారని WG నేతలతో భేటీలో మండిపడ్డారు.