News September 4, 2025
ర్యాగింగ్ జరగకుండా చర్యలు చేపట్టండి: SP

విద్యా సంస్థల్లో ర్యాగింగ్ జరగకుండా కఠిన చర్యలు చేపట్టాడని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పోలీసు అధికారులను బుధవారం ఆదేశించారు. ర్యాగింగ్ వలన కలిగే దుష్ప్రభావాలను విద్యార్థులకు వివరించి, అవగాహన కల్పించాలని సూచించారు. తమ పరిధిలోగల ఇంజినీరింగ్, మెడికల్, పాలిటెక్నిక్ కళాశాలలను, ఇతర విద్యాలయాలను సందర్శించి అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
Similar News
News September 5, 2025
VZM: ఐటీఐ ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్లో 600/600

ఇటీవల జరిగిన ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్లో విజయనగరం ప్రభుత్వ ఐటీఐ విద్యార్థి ఎర్ల సాయి సత్తా చాటాడు. సీనియర్ ఎలక్ట్రీషియన్ విభాగంలో 600/600 మార్కులు సాధించి జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడని ప్రిన్సిపల్ టీవీ గిరి తెలిపారు. సీనియర్ ఎలక్ట్రీషియన్ విభాగంలో 590 ప్లస్ మార్కులను ఆరుగురు విద్యార్థులు సంపాదించారన్నారు. జూనియర్ విభాగంలో కూడా మంచి ఉత్తీర్ణత నమోదైందని వెల్లడించారు.
News September 5, 2025
VZM: 7న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల రాత పరీక్ష

ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో ఈనెల 7న నిర్వహించనున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ల రాత పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాస మూర్తి ఆదేశించారు. ఈ పరీక్షకు చేయాల్సిన ఏర్పాట్లపై విజయనగరం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. అభ్యర్థులు హాల్ టిక్కెట్తో పాటు ఏదైనా గుర్తింపు కార్డును తీసుకురావాలన్నారు.
News September 5, 2025
VZM: ‘13న కేసులు రాజీ చేసుకోండి’

విజయనగరం జిల్లా కోర్టు ప్రాంగణంలో సెప్టెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు సీనియర్ సివిల్ జడ్జి కృష్ణప్రసాద్ గురువారం తెలిపారు. వాహన ప్రమాదాలు, బ్యాంకులకు సంబంధించిన కేసులు, కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, NIA యాక్ట్, ఎక్సైజ్ కేసులు, కుటుంబ వివాదాలు, కార్మిక సంబంధిత, సివిల్ కేసులను కూడా పరిష్కరించుకోవచ్చన్నారు. నూతన కోర్డు భవనంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందన్నారు.