News March 30, 2025
లంచం తీసుకున్న పిఠాపురం ఎస్ఐ సస్పెండ్

ఇటీవల పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ దొంతమూరు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తుల దగ్గర లంచం తీసుకున్న పిఠాపురం రూరల్ ఎస్సై గుణశేఖర్ను సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఈనెల 24న లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డ SI గుణశేఖర్ను అదుపులో తీసుకుని విచారణ చేపట్టారు. అప్పటి నుంచి ఆయన రిమాండ్లోనే ఉన్నారు. ఈ నేపథ్యం శనివారం రాత్రి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
Similar News
News November 2, 2025
MBNR: జాతరలో తప్పిపోయిన పిల్లలు, వృద్ధుల అప్పగింత

జిల్లా ఎస్పీ డి.జానకి ఆదేశాల మేరకు ‘AHTU’ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లాలో అక్టోబర్ నెలలో అవగాహన కార్యక్రమాలు, నిఘా చర్యలు చేపట్టారు. మొత్తం 22 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. స్కూళ్లు, కళాశాలలు, గ్రామాల్లో ఈ ప్రోగ్రాంలు కండక్ట్ చేశారు. అధికారులు 30 హాట్స్పాట్ ప్రాంతాలను సందర్శించి సమాచారాన్ని సేకరించారు. కురుమూర్తి జాతరలో తప్పిపోయిన పిల్లలు, వృద్ధులను గుర్తించి తమతమ కుటుంబాలకు అప్పగించారు.
News November 2, 2025
నా ఫ్యామిలీపై క్రిమినల్ కేసులు పెట్టారు: జస్టిస్ ఎన్వీ రమణ

AP: రాజ్యాంగ సూత్రాలను సమర్థించిన న్యాయవ్యవస్థ సభ్యులు బదిలీలు, ఒత్తిడిని ఎదుర్కొన్నారని మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని క్రిమినల్ కేసులు పెట్టారని చెప్పారు. వీఐటీ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు. దక్షిణ భారతంలో జరిగిన అతిపెద్ద ఉద్యమం అమరావతి రైతుల పోరాటమని గుర్తు చేశారు. దేశంలో చట్టబద్ధమైన పాలన ఉన్నప్పుడే అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.
News November 2, 2025
పాలమూరు వర్సిటీ.. రేపు ఓరియంటేషన్ ప్రోగ్రాం

పాలమూరు యూనివర్సిటీలోని అకడమిక్ బ్లాక్ ఆడిటోరియంలో రేపు ‘ఓరియంటేషన్ ప్రోగ్రామ్’ నిర్వహిస్తున్నామని యూనివర్సిటీ లా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జె.మాలవి తెలిపారు. LL.B(3ydc) & LL.M 1 బ్యాచ్ విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమం ఉదయం 10:30కు ప్రారంభమవుతుందని, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యూనివర్సిటీ ఉపకులపతి(VC) జీఎన్ శ్రీనివాస్ హాజరవుతున్నారన్నారు. విద్యార్థులు తప్పక హాజరుకావాలని ఆమె కోరారు.


