News January 20, 2025

లక్కవరంలో మామిడి తోటలో పార్టీ..ఆరుగురు అరెస్ట్

image

జంగారెడ్డిగూడెం(M) లక్కవరం శివారులో మామిడి తోటలో అల్లరి సృష్టిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు చేపట్టారు. శనివారం అర్ధరాత్రి సమయంలో పార్టీ చేసుకుంటూ అల్లర్లు చేస్తున్నారంటూ వచ్చిన సమాచారంతో జంగారెడ్డిగూడెం సీఐ కృష్ణబాబు తన సిబ్బందితో దాడులు చేపట్టారు. 23 తెలంగాణ మద్యం సీసాలు, 5 కార్లు, 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిని అరెస్ట్ చేయగా నలుగురు పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు.

Similar News

News February 21, 2026

నరసాపురం: గాల్లో ఎగురుతూ కరెంటు పనులు!

image

నరసాపురంలో విద్యుత్ శాఖ శనివారం సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. డ్రోన్ల సాయంతో 11 KV విద్యుత్ వైర్లను బిగించే పనులను అధికారులు విజయవంతంగా నిర్వహించారు. 10 మంది కార్మికులు చేయాల్సిన కఠినమైన పనిని, డ్రోన్ సాయంతో కేవలం ఇద్దరు కార్మికులు పూర్తి చేశారు. దీనివల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా, కార్మికులకు భద్రత పెరిగిందని ఈఈ మధుకుమార్ తెలిపారు.

News February 21, 2026

భీమవరం: పంట కాలువలోకి దూసుకెళ్లిన బస్సు

image

భీమవరం మండలం యనమదుర్రులోని సూర్యమిత్ర ఫ్యాక్టరీ వద్ద శనివారం ప్రమాదం జరిగింది. సదరు ఫ్యాక్టరీకి చెందిన బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బస్సు ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సూర్యమిత్ర ఫ్యాక్టరీ బస్సుగా దీన్ని గుర్తించినట్లు గ్రామస్థులు తెలిపారు. పోలీసులు విచారణ చేపట్టారు.

News February 21, 2026

ప.గో: శ్రీవారి ఫొటోలతో ప్లకార్డులు.. MLA నాయకర్ ఫైర్

image

శాసన మండలిలో YCP ఎమ్మెల్సీలు శ్రీవారి చిత్రపటాలను ప్లకార్డుల్లా వాడుతూ, చెప్పులేసుకుని వాటిని విసిరేయడంపై నరసాపురం MLA బొమ్మిడి నాయకర్ శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో MLA బొలిశెట్టితో కలిసి ఆయన మాట్లాడారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన YCPకి ప్రజా క్షేత్రంలో ఉండే అర్హత లేదన్నారు. దేవుడి చిత్రపటాలను అవమానిస్తూ పాపానికి ఒడిగట్టారని మండిపడ్డారు.