News March 20, 2025
లక్షటిపేట: చేపల వేట.. మత్స్యకారుడి మృతి

లక్షటిపేట మున్సిపాలిటీలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన మేడి లింగయ్య 65 మత్స్యకారుడు మృతి చెందినట్లు ఎస్ఐ సతీశ్ తెలిపారు. మృతుడు చేపలు పట్టుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. రోజులాగే చేపల వేటకు గోదావరికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు వెతకగా ఒడ్డున చనిపోయి ఉన్నాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News September 19, 2025
వేములవాడ: ఈనెల 22 నుంచి శరన్నవరాత్రులు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 11 రోజులపాటు దేవీ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు గురువారం దేవస్థానం ఈవో రమాదేవి తెలిపారు. సెప్టెంబర్ 29న ప్రత్యేక రథోత్సవం, సెప్టెంబర్ 30న గజవాహన సేవ, అక్టోబర్ 1న మహిషాసురమర్దిని అలంకారం, అక్టోబర్ 2న విజయదశమి నాడు శమిపూజ, అపరాజితాదేవీ ఆలయ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
News September 19, 2025
సంగారెడ్డి: ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు గడువు పొడిగింపు

సంగారెడ్డి జిల్లాలో ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్ తరగతుల్లో ప్రవేశాలకు ఈనెల 24 వరకు గడువు పొడిగించినట్లు జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ వెంకటస్వామి తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు మండలంలోని ఓపెన్ స్కూల్ అధ్యయన కేంద్రాల్లో సంప్రదించాలని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News September 19, 2025
అంతర్గత, బాహ్య పరాన్నజీవులతో కోళ్లకు కలిగే ముప్పు

అంతర్గత పరాన్నజీవుల వల్ల ఏలికపాములు, బద్దెపురుగులు కోళ్లను తరచూ బాధిస్తాయి. ఈ సమస్య నివారణకు వెటర్నరీ నిపుణుల సలహా మేరకు పైపరిజన్, లెవామిసోల్ మందులతో కోళ్లకు అప్పుడప్పుడు డీవార్మింగ్ చేయించాలి. బాహ్యపరాన్న జీవులైన పేలు, గోమారి, నల్లులు కోళ్లకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తాయి. కోళ్లపై, షెడ్లో ఈ కీటకాలను గుర్తిస్తే వెటర్నరీ నిపుణుల సూచనతో కీటక సంహారక మందులను కోళ్లపై, షెడ్డు లోపల, బయట పిచికారీ చేయాలి.