News February 20, 2025
లక్షెట్టిపేట: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

లక్షెట్టిపేట మండలం హనుమంతుపల్లికి చెందిన నస్పూరి గౌరయ్య(49) స్లాబ్ రాడ్డుకు నైలాన్ తాడుతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై సతీశ్ తెలిపారు. గౌరయ్య ముంబైలో కూలి పనిచేసి సంవత్సరం క్రితం గ్రామానికి వచ్చి కూతురు పెళ్లి చేసి ఇల్లు కట్టుకున్నాడు. వాటికోసం సుమారు రూ.5 లక్షలు అప్పు చేశాడన్నారు. అప్పులు తీర్చడం భారమై గౌరయ్య ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని, కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Similar News
News February 21, 2026
అథ్లెటిక్స్లో సిద్దిపేట జిల్లాకు రెండు పతకాలు

హనుమకొండలో సీఎం కప్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సిద్దిపేట క్రీడాకారులు సత్తా చాటారు. రెండో రోజు జిల్లాకు చెందిన ఇద్దరు పతకాలు సాధించినట్లు కోచ్ వెంకటస్వామి తెలిపారు. అండర్-16 బాలుర షాట్పుట్ విభాగంలో చేర్యాల మోడల్ స్కూల్ విద్యార్థి ప్రణయ్ కుమార్ వెండి పతకం సాధించగా, బాలికల 100 మీటర్ల హర్డిల్స్లో చింతమడక కేవీఆర్ఎస్ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థిని చక్రిక కాంస్య పతకం కైవసం చేసుకున్నారు.
News February 21, 2026
VZM: డ్రైవింగ్ శిక్షణలో లోపాలు బట్టబయలు

విజయనగరం జిల్లాలోని డ్రైవింగ్ స్కూళ్లపై రవాణాశాఖ శనివారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. నిబంధనలు పాటించకపోవడం, సరైన పత్రాలు లేకపోవడం, అర్హతలేని శిక్షకులతో శిక్షణ ఇవ్వడం వంటి లోపాలు గుర్తించారు. దీంతో 3 డ్రైవింగ్ స్కూళ్ల లైసెన్సులను అధికారులు రద్దు చేశారు. మరికొన్నింటికి షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ కోరారు. రోడ్డు భద్రత కోసం నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News February 21, 2026
పాలిటెక్నిక్తో ఉజ్వల భవిష్యత్తు: ప్రిన్సిపల్

పదో తరగతి పూర్తయిన తర్వాత పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరడం ద్వారా విద్యార్థులు త్వరగా ఉపాధి అవకాశాలు పొందవచ్చని ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ మల్లికార్జున్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలోని 31 ప్రభుత్వ పాఠశాలల్లో ‘పాలిసెట్-2026’పై అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఏప్రిల్ 24వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


