News February 5, 2025
లక్షెట్టిపేట: ‘సుస్థిర ఆస్తుల కల్పన EGSలోనూ సాధ్యం’

సుస్థిర ఆస్తుల కల్పన MNREGSలో సాధ్యమవుతుందని DRDO కిషన్ అన్నారు. మంగళవారం లక్షెట్టిపేట మండలం జెండావెంకటాపూర్, పోతపల్లి గ్రామాల్లో ఉపాధి హామీ నిధులతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల ప్రహరీ, ఇతర పనులను పరిశీలించారు. రైతులకు పశువుల కొట్టాలు, అజోల గడ్డి పెంపకం, నాడేపు కంపోస్ట్, చెక్ డ్యామ్స్, కిచెన్ షెడ్, పాఠశాల ప్రహరీల వంటి సుస్థిర ఆస్తులు ఉపాధి హామీ పథకంలో నిర్మిస్తున్నామన్నారు.
Similar News
News July 9, 2025
నిర్మల్: ‘15 తేదీలోగా దరఖాస్తు చేసుకోండి’

జిల్లాలో పదో తరగతి చదువుతున్న దివ్యాంగుల వివరాలను జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి పంపించాలని డీఈవో రామారావు తెలిపారు. మార్చి 2026లో జరిగే పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే దివ్యాంగులకు కొన్ని మినహాయింపులు వర్తిస్తాయని తెలిపారు. దరఖాస్తు ఫారాన్ని నింపి దివ్యాంగుల సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలను జతచేసి ఈనెల 15వ తేదీలోగా ప్రధానోపాధ్యాయుల ద్వారా డీఈఓ కార్యాలయంలో అందించాలని సూచించారు.
News July 9, 2025
ఏలూరు: 14న 2,500 ఉద్యోగాలకు జాబ్ మేళా

వట్లూరులోని CR రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో జులై 14న ఎంపీ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి జితేంద్రబాబు బుధవారం తెలిపారు. సుమారు 2,500 ఉద్యోగ ఖాళీలకు ఈ మేళా నిర్వహిస్తున్నామన్నారు. 18-35 ఏళ్ల లోపు వారు అర్హులన్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఫార్మసీ, ఎంబీఏ, పీజీ, బీటెక్ విద్యార్హతలు ఉండాలన్నారు. వివరాలకు 8143549464 సంప్రదించాలి.
News July 9, 2025
కామారెడ్డి: రైతుల్లో చిగురిస్తున్న ఆశలు

KMR జిల్లాలో కొన్ని రోజులుగా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో రైతులు వరినాట్లు వేసుకోగా.. మరికొందరు నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. KMR జిల్లాలో గతేడాది 3,16,242 ఎకరాల్లో వరి పండించగా ఈ ఏడాది 3,18,530 ఎకరాల్లో పండించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. పత్తి గతేడాది 34,459 ఎకరాల్లో పండించగా ఈ ఏడాది 34,549 ఎకరాల్లో పండించవచ్చని పేర్కొన్నారు.