News January 24, 2026
లక్ష్యాలను సాధించి ‘ఎ’ గ్రేడ్ పొందాలి: కలెక్టర్

ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల్లో ‘బి’, ‘సి’ గ్రేడ్లలో ఉన్న శాఖలు తమ పనితీరును మెరుగుపరుచుకుని ‘ఎ’ గ్రేడ్ సాధించాలని కలెక్టర్ జి.రాజకుమారి ఆదేశించారు. శుక్రవారం నంద్యాల కలెక్టరేట్లో కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ (KPI) ప్రగతిపై అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరడంలో అధికారులు అలసత్వం వహించకూడదని, ప్రగతి సూచికల్లో వెనుకబడిన శాఖలు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.
Similar News
News April 13, 2026
అంబేడ్కర్ జయంతిని విజయవంతం చేయాలి: కలెక్టర్

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం 9 గంటలకు నల్గొండ జిల్లా కేంద్రంలోని డీఈఓ కార్యాలయం వద్ద జరిగే ఉత్సవాలకు అధికారులు, ఎస్సీ సామాజిక వర్గ నాయకులు పెద్ద ఎత్తున హాజరుకావాలని కోరారు. జిల్లా అధికారులు ఈ వేడుకల్లో తప్పనిసరిగా పాల్గొని, కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన ఆదేశించారు.
News April 13, 2026
TCSలో మత మార్పిడులు, లైంగిక వేధింపులపై విచారణ: ఛైర్మన్

నాసిక్ <<19633913>>TCS<<>> క్యాంపస్లో మత మార్పిడులు, లైంగిక వేధింపుల వ్యవహారంలో ఏడుగురు ఉద్యోగులను సస్పెండ్ చేశామని టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ తెలిపారు. వాస్తవాలను గుర్తించేందుకు COO ఆరతి సుబ్రమణియన్ నేతృత్వంలో సమగ్ర విచారణ జరుగుతోందని పేర్కొన్నారు. కాగా అసిఫ్, షఫీ, షారుఖ్, రజా, తౌసిఫ్, డానిష్ అనే ఉద్యోగులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పలువురు మహిళా ఉద్యోగులు ఫిర్యాదు చేశారు.
News April 13, 2026
సిరిసిల్ల: ప్రమాదాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి

రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో రోడ్డు ప్రమాదాల నియంత్రణపై సంబంధిత అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వేములవాడ నుంచి కరీంనగర్ రోడ్డులో అవసరమైన సైన్ బోర్డు పెట్టి రంబుల్ స్టెప్స్ ఏర్పాటు చేయాలన్నారు. హెల్మెట్ వినియోగం సీట్ బెల్ట్ ఇతర అంశాలపై అవగాహన కల్పించాలన్నారు.


