News March 27, 2026
లగ్జరీ ఫ్లాట్ కొన్న గిల్.. బిల్డర్ హీరోయిన్ భర్తే!

దేశంలోనే రిచెస్ట్ పర్సన్స్ నివసించే ముంబై జుహూలో టీమ్ ఇండియా కెప్టెన్ గిల్ లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేశారు. ఏకంగా రూ.20.7 కోట్లు పెట్టి ఓ అపార్ట్మెంట్ 12వ ఫ్లోర్లో 3,369 చ.అ. ఫ్లాట్ కొన్నారు. స్టాంప్ డ్యూటీకే 1.24Cr చెల్లించారు. ఇక ఈ అపార్ట్మెంట్ను ఓ రియల్ ఎస్టేట్ సంస్థతో కలిసి రకుల్ప్రీత్ భర్త జాకీ భగ్నానీ, ఆయన పేరెంట్స్ నిర్మిస్తుండటం గమనార్హం. దీని నిర్మాణం 2029లో పూర్తి కానుంది.
Similar News
News April 13, 2026
5 కేజీల సిలిండర్ల సరఫరా పెంపు

గ్యాస్ కొరతను నివారించేందుకు కేంద్రం 5 కేజీల LPG సిలిండర్ల సరఫరాను భారీగా పెంచింది. మార్చి 23 నుంచి 13 లక్షలకు పైగా సిలిండర్లను అమ్మింది. ప్రస్తుతం రోజువారీ సేల్స్ లక్ష యూనిట్లను దాటాయి. ఎక్కువగా వలస కార్మికులు వీటిని కొంటున్నారు. మరోవైపు మార్చి నుంచి 4.24 లక్షల PNG కనెక్షన్లను ప్రభుత్వం యాక్టివేట్ చేసింది. డొమెస్టిక్ LPG సరఫరా స్థిరంగా కొనసాగుతోంది. ఈ నెల 11న 52 లక్షల సిలిండర్లు డెలివరీ అయ్యాయి.
News April 13, 2026
సరిహద్దు గ్రామాలకు చైనా పేర్లు.. ఖండించిన భారత్

అరుణాచల్ ప్రదేశ్ సహా భారత్ సరిహద్దుల్లోని గ్రామాలకు చైనా పేర్లు మార్చడాన్ని భారత్ ఖండించింది. ఈ ఫేక్ నేమ్స్ నిజాన్ని మార్చలేవని విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ తరహా చర్యలు ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత దెబ్బతీస్తాయని హెచ్చరించింది. కాగా ఇటీవల PoK సరిహద్దు వెంబడి చైనా కొత్త గ్రామాన్ని నిర్మించింది. గతంలో ఇక్కడే రెండు గ్రామాలు నిర్మించగా అందులో కొంత లద్దాక్ పరిధిలోకి వస్తుందని భారత్ తోసిపుచ్చింది.
News April 13, 2026
సరిహద్దు గ్రామాలకు చైనా పేర్లు.. ఖండించిన భారత్

అరుణాచల్ ప్రదేశ్ సహా భారత్ సరిహద్దుల్లోని గ్రామాలకు చైనా పేర్లు మార్చడాన్ని భారత్ ఖండించింది. ఈ ఫేక్ నేమ్స్ నిజాన్ని మార్చలేవని విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ తరహా చర్యలు ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత దెబ్బతీస్తాయని హెచ్చరించింది. కాగా ఇటీవల PoK సరిహద్దు వెంబడి చైనా కొత్త గ్రామాన్ని నిర్మించింది. గతంలో ఇక్కడే రెండు గ్రామాలు నిర్మించగా అందులో కొంత లద్దాక్ పరిధిలోకి వస్తుందని భారత్ తోసిపుచ్చింది.


