News January 31, 2026

లడ్డూ కల్తీ.. ఈవో నిర్లక్ష్యమూ కారణం: SIT

image

AP: తిరుమల లడ్డూ వ్యవహారంలో CBI SIT రాష్ట్ర ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించింది. TTD మాజీ ఛైర్మన్ YV సుబ్బారెడ్డి హయాంలో నెయ్యి సేకరణకు సంబంధించి నిబంధనల్లో వచ్చిన మార్పులే కల్తీకి కారణమని తేల్చినట్లు పేర్కొంది. అప్పటి, ప్రస్తుత EO అనిల్ కుమార్ సింఘాల్ నేరుగా అవినీతికి పాల్పడినట్లు చెప్పలేదు. కానీ ఈ వ్యవహారాన్ని గుర్తించడంలో విఫలమయ్యారని, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపింది.

Similar News

News February 10, 2026

ఉపవాసం: ఎవరు ఉండాలి? ఎవరు ఉండకూడదు?

image

ఉపవాసం శ్రేష్ఠమైనదే అయినా అందరికీ వర్తించదు. గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలు, వృద్ధులు కఠిన ఉపవాసాలకు దూరంగా ఉండటం ఉత్తమం. మధుమేహం, రక్తహీనత, గుండె జబ్బులు ఉన్నవారు సుదీర్ఘ సమయం ఆహారం మానేస్తే అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. స్థూలకాయులు, BP, చర్మ వ్యాధులతో బాధపడేవారు వైద్యుల సలహాతో ఉపవాసం చేయడం వల్ల ప్రయోజనాలు పొందుతారు. ఇది శరీరంలోని విషతుల్యాలను తొలగించి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

News February 10, 2026

స్పీకర్‌పై అవిశ్వాసం.. మెజార్టీ ఉంటేనే!

image

లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాపై ప్రతిపక్షాలు ఇవాళ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఆర్టికల్ 94-C కింద తీర్మానం ప్రవేశ పెట్టాలి అంటే 14 రోజుల ముందే నోటీసు ఇవ్వాలి. సభలోని 50 మంది సభ్యులు మద్దతుతో నోటీసు ఇచ్చాక చర్చకు నిర్దేశిస్తారు. 10 రోజుల్లోపే చర్చ చేపట్టి ఓటింగ్ నిర్వహిస్తారు. మెజార్టీ ఆధారంగా అనర్హత వేటు ఉంటుంది. కాగా లోక్‌సభలో NDAకే మెజార్టీ ఉండటంతో స్పీకర్ తొలగింపు అసాధ్యమే.

News February 10, 2026

కల్తీ నెయ్యి.. చంద్రబాబుకు పెద్ద జియ్యంగార్ల లేఖ

image

AP: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై పెద్ద జియ్యంగార్ల మఠం ఆగ్రహం వ్యక్తం చేసింది. నెయ్యి కల్తీ అపచారమని, బాధ్యతారహితమైన చర్య అని సీఎం చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొంది. భవిష్యత్తులో తిరుమలలో అపచారాలు జరగకుండా పటిష్ఠమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరింది. ఆలయాల పవిత్రతను, ధర్మాన్ని రక్షించే శక్తిని సీఎంకు ఇవ్వాలని ఆకాంక్షించింది. కాగా ఈ కేసులో ఇప్పటికే <<19088531>>ఈడీ<<>> ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.