News April 8, 2025

లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన ఎమ్మెల్యే కోరం, కలెక్టర్

image

టేకులపల్లి మండలం లచ్చగూడెం గ్రామంలో మంగళవారం సన్న బియ్యం లబ్ధిదారుడైన గుమ్మడి సురేశ్- శశికల దంపతుల ఇంట్లో ఎమ్మెల్యే కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ జితేష్‌ వి పాటిల్, ఐటీడీఏ పీవో రాహుల్, డీఎస్పీ చంద్రభాను భోజనం చేశారు. అనంతరం వారితో ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని ఆ కుటుంబానికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

Similar News

News February 25, 2026

ఏపీ మెడిటెక్ జోన్‌లో ఇండో-జర్మన్ టెక్నాలజీ సెంటర్?

image

విశాఖలోని A.P మెడిటెక్ జోన్‌లో ఇండో-జర్మన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. జర్మన్ కాన్సుల్ జనరల్ ప్రతినిధి బృందం పర్యాటనలో ఈ ప్రతిపాదనపై చర్చలు జరిగాయి. మెడ్‌టెక్ రంగంలో సంయుక్త పరిశోధన, ఆధునిక సాంకేతిక అభివృద్ధికి ఇది కీలకం కానుంది. ఇదే రోజున రోబోటిక్స్ సంస్థ Cogmac Technologies మెడిటెక్ జోన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

News February 25, 2026

జగిత్యాల: ‘భూభారతి దరఖాస్తులు జాగ్రత్తగా చేయాలి’

image

జగిత్యాల జిల్లాలోని మీసేవ నిర్వహకులకు కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సులో అడిషనల్ కలెక్టర్ లత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భూభారతి దరఖాస్తులు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని సూచించారు. సమస్యలకు తగిన దరఖాస్తులు నింపి రైతులకు, వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా చూడలన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. మీసేవ నిర్వహకులపై ఫిర్యాదులొస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

News February 25, 2026

మాజీ సీఎం మనవడు మృతి

image

ఝార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ మనవడు వీర్ సోరెన్(19) మరణించారు. ఫ్రెండ్స్‌తో కలిసి మనాలి ట్రిప్‌కు వెళ్లిన అతడు అక్కడే అనుమానాస్పదంగా మృతి చెందారు. ‘తలనొప్పిగా ఉందని మాత్రలు వేసుకున్న కొద్దిసేపటికే అతడు స్పృహతప్పి పడిపోయారు. ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయారు’ అని మనాలి DSP శర్మ కేడీ తెలిపారు. ఈ ఘటన తమ కుటుంబంలో తీవ్ర విషాదం నింపిందని చంపై సోరెన్ వాపోయారు.