News April 8, 2025

లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన ఎమ్మెల్యే కోరం, కలెక్టర్

image

టేకులపల్లి మండలం లచ్చగూడెం గ్రామంలో మంగళవారం సన్న బియ్యం లబ్ధిదారుడైన గుమ్మడి సురేశ్- శశికల దంపతుల ఇంట్లో ఎమ్మెల్యే కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ జితేష్‌ వి పాటిల్, ఐటీడీఏ పీవో రాహుల్, డీఎస్పీ చంద్రభాను భోజనం చేశారు. అనంతరం వారితో ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని ఆ కుటుంబానికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

Similar News

News April 17, 2025

పల్నాడు: 2 నెలల్లో రిటైర్‌మెంట్.. గుండెపోటుతో టీచర్ మృతి

image

పిడుగురాళ్ల (M) బ్రాహ్మణపల్లి ZP స్కూల్ ఇంగ్లిష్ టీచర్ వెంకటరెడ్డి గుంటూరు DEO ఆఫీస్ వద్ద గుండెపోటుతో కుప్పకూలిపోయారు. DEO సి.వి రేణుక సత్వరమే స్పందించడంతో ఉర్దూ DI ఖాశీం, DEO ఆఫీస్ సిబ్బంది హాస్పిటల్‌కి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్థారించారు. తూర్పు MEO ఖుద్దూస్, APTF అధ్యక్షుడు బసవలింగారావు వెంకటరెడ్డికి నివాళులర్పించారు. ఈయన 2 నెలల్లో రిటైర్ కానున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

News April 17, 2025

జంగారెడ్డిగూడెం: ఇంటర్ విద్యార్థిని సూసైడ్

image

జంగారెడ్డిగూడెంలో బుధవారం విషాద ఘటన జరిగింది. తల్లిదండ్రులు వేరుగా ఉంటున్నారని అల్లు అలేఖ్య (16) అనే బాలిక ఉరేసుకొని మృతి చెందింది. ఈ ఘటనపై ఎస్ఐ జబీర్ వివరాల ప్రకారం.. రవి- నాగ దుర్గాదేవి దంపతులు. వీరి మధ్య ఏర్పడిన విభేదాలతో విడిగా ఉంటున్నారు. కుమార్తె అలేఖ్య అమ్మమ్మ ఇంటి వద్ద ఇంటర్ చదువుతోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుందని, తన మృతితోనైనా తల్లిదండ్రులు కలిసి ఉండాలని లేఖ రాసిందన్నారు. 

News April 17, 2025

మహబూబాబాద్ జిల్లాలో పత్తి సాగు ప్రశ్నార్థకమేనా?

image

మహబూబాబాద్ జిల్లాలో పత్తి రైతుపై ధరల పిడుగు పడింది. రానున్న వర్షాకాలం ప్రారంభానికి ముందే విత్తన కంపెనీలు అమాంతం ధరలు పెంచేశాయి. దీంతో ఇప్పటికే అతివృష్టి, అనావృష్టితో నష్టాలు చవి చూస్తున్న రైతులపై ఆర్థిక భారం మరింత పడనుంది. దీంతో పత్తి సాగువైపు ఈసారి రైతులు మొగ్గు చూపుతారనేది ప్రశ్నార్థకంగా మారింది. 2019లో ప్యాకెట్ ధర రూ.710 ఉండగా ప్రస్తుతం 901కి చేరడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

error: Content is protected !!