News July 23, 2024
లభ్యంకాని నరసాపురం MPDO ఆచూకీ

నరసాపురం ఎంపీడీవో అదృశ్యమై ఎనిమిది రోజులు దాటినా ఆచూకీ లభ్యం కాలేదు. పోలీసులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా ఫలించడం లేదు. ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఇంకా జీవించే ఉన్నారా? అనే దానిపై స్పష్టత రానట్లు తెలుస్తోంది. . సోమవారం కూడా ఏలూరు కాలువను పూర్తిగా గాలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో జీవించి ఉండవచ్చనే అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి.
Similar News
News December 23, 2025
ఏలూరు జిల్లాలో 92.93 శాతం మందికి పోలియో చుక్కలు

ఏలూరు జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి గీతాబాయి తెలిపారు. ఈనెల 21 నుంచి 23 వరకు ఐదేళ్లలోపు పిల్లలకు బూత్లలోనూ, ఇంటింటికీ తిరిగి చుక్కలు వేశారు. జిల్లావ్యాప్తంగా 1,87,204 మంది చిన్నారులకు గాను, 1,73,975 (92.93%) మందికి పోలియో చుక్కలు వేసినట్లు ఆమె వెల్లడించారు.
News December 23, 2025
ప.గో: జిల్లాకు 5,288 టన్నుల యూరియా సరఫరా

జిల్లాకు డిసెంబర్ నెలకు సంబంధించి 23,018 టన్నుల యూరియా తాడేపల్లిగూడెం రైల్వే ర్యాక్కు వచ్చిందని, ప్రైవేట్ డీలర్లు, మార్క్ ఫెడ్, సొసైటీలకు 5,288 టన్నుల యూరియా సరఫరా చేసినట్లు ఏడీఏ ఆర్.గంగాధర్ రావు మంగళవారం తెలిపారు. తాడేపల్లిగూడెం 1,653, పెంటపాడు 485 టన్నులు డీలర్ల వద్ద నిల్వ ఉందన్నారు. యూరియా నిల్వలను ప్రైవేట్, సొసైటీ, రైతు సేవా కేంద్రాల వద్ద ప్రదర్శించనున్నట్లు తెలిపారు.
News December 23, 2025
పెనుమంట్ర: రోడ్డు ప్రమాదంపై త్రిసభ్య కమిటీ వేసిన కలెక్టర్

పెనుమంట్ర మండలం పొలమూరులో సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్పందించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసు, రవాణా శాఖలతో పాటు ఆర్అండ్బీ శాఖ అధికారులతో త్రిసభ్య కమిటీ వేసి విచారణ చేయాలని ఆమె ఆదేశించారు.


