News March 24, 2026

లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు

image

ఇరాన్‌‌తో చర్చలు చేపడతామని ట్రంప్ ప్రకటించడంతో ఈరోజు మార్కెట్లకు ఊరట లభించింది. సెన్సెక్స్ 865 పాయింట్ల లాభంతో 73,571కు చేరగా నిఫ్టీ 275 పాయింట్లు ఎగిసి 22,841 వద్ద ట్రేడవుతోంది. నిన్న చమురు ధరలు తగ్గడం, రూపాయి విలువ కోలుకోవడం, కొనుగోల్లు పెరగడం కలిసొచ్చింది. అయితే ఇరాన్‌పై దాడులు కొనసాగుతుండటంతో క్రూడ్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ ప్రభావం మార్కెట్ల లాభాలపై పడే అవకాశం ఉంది.

Similar News

News April 10, 2026

5,000 మంది ఇరాన్ సైనికులు హతం: ఇజ్రాయెల్

image

40 రోజులపాటు కొనసాగిన యుద్ధంలో ఇరాన్‌లోని 4వేల టార్గెట్లపై 10,800 దాడులు చేసినట్లు IDF వెల్లడించింది. దాడి మొదటి రోజే కేవలం 40 సెకన్లలో సుప్రీం లీడర్ ఖమేనీ సహా 40 మందిని హతమార్చినట్లు తెలిపింది. ఇప్పటి వరకు దాదాపు 5వేల మంది ఇరానియన్ సైనికులు చనిపోయినట్లు అంచనా వేసింది. 85 శాతం డిఫెన్స్ వ్యవస్థలను నాశనం చేసినట్లు పేర్కొంది. ఇక ఇజ్రాయెల్‌పై ఇరాన్ 650 మిస్సైళ్లను వేయగా 24 మంది చనిపోయినట్లు సమాచారం.

News April 10, 2026

ఆర్టీసీ భూములు సరే.. గీతం సంగతేంటి: YCP

image

AP: విజయవాడ నడిబొడ్డున రూ.కోట్ల విలువైన RTC భూములను చంద్రబాబు కమీషన్ తీసుకొని లులూకు కట్టబెట్టారని YCP ఆరోపించింది. ఈ అక్రమ భూకేటాయింపులపై తాము చేసిన పోరాటానికి దెబ్బకి దిగొచ్చి కేటాయింపులను రద్దు చేసుకున్నారని తెలిపింది. RTC భూములు సరే, విశాఖలో గీతం యూనివర్సిటీకి కట్టబెట్టిన రూ.5వేల కోట్ల విలువైన భూముల సంగతేంటి CBN? అని ప్రశ్నించింది. ఆ కేటాయింపులను ఎప్పుడు రద్దు చేస్తారు? అని ట్వీట్ చేసింది.

News April 10, 2026

BSNL కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్

image

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ BSNL కస్టమర్ల కోసం అదిరిపోయే ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ.599కే 70 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఇందులో రోజుకు 3GB హైస్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. ప్రైవేట్ నెట్‌వర్క్‌లైన జియో, ఎయిర్‌టెల్‌ యూజర్లు ఇదే తరహా బెనిఫిట్స్ కోసం దాదాపు రెండింతలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. బడ్జెట్ ధరలో ఎక్కువ డేటా కోరుకునే వారికి ఈ ప్లాన్ బెస్ట్.