News January 16, 2026
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 234 పాయింట్లు పెరిగి 83,619 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో 25,712 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్-30 సూచీలో ఇన్ఫీ, టెక్ మహీంద్రా, M&M, అదానీ పోర్ట్స్, ట్రెంట్ షేర్లు లాభాల్లో.. ఎటర్నల్, భారతీ ఎయిర్టెల్, సన్ ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.313 వద్ద ప్రారంభమైంది.
Similar News
News February 5, 2026
ఐఐటీ హైదరాబాద్లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు

<
News February 5, 2026
స్వర్ణ వార్డు, గ్రామ సిబ్బందికి త్వరలో ప్రమోషన్లు

AP: స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ ఉద్యోగులకు త్వరలోనే పదోన్నతులు దక్కనున్నాయి. అర్హతలు, సీనియార్టీ, పనితీరు ఆధారంగా ప్రభుత్వం వీరికి ప్రమోషన్లు ఇవ్వనుంది. అలాగే రేషనలైజేషన్ పూర్తి చేసి ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల్లో వీరిని నియమించాలని భావిస్తోంది. ఆఫీసుల పర్యవేక్షణకు జిల్లా, మండల స్థాయి అధికారులను నియమించనుంది. దీనివల్ల ఉద్యోగులకు మేలు చేకూరి ప్రజలకు నాణ్యమైన సేవలందుతాయని భావిస్తోంది.
News February 5, 2026
వ్యవసాయ రంగం అంటే చంద్రబాబుకు చిన్నచూపు: సజ్జల

AP: వ్యవసాయ రంగంపై చంద్రబాబుకు చిన్నచూపు ఉందని YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయడం రాయలసీమకే కాకుండా రాష్ట్రానికే ఘోర అన్యాయమన్నారు. చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ పథకాన్ని అడ్డుకున్నారని ఆరోపించారు. YCP నిర్వహించిన ఛలో పోతిరెడ్డిపాడు కార్యక్రమంలో సజ్జలతో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు.


