News June 4, 2024
లావు కృష్ణదేవరాయలు ఆధిక్యం

పల్నాడులో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆయన సమీప ప్రత్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కంటే 509 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. మొత్తంగా లావుకు 4,103 ఓట్లు, అనిల్కు 3,594 ఓట్లు పోలయ్యాయి.
Similar News
News April 24, 2025
పొన్నూరు: వీరయ్య చౌదరి హత్య కేసులో అదుపులోకి ఐదుగురు

టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసు దర్యాప్తులో ఓ కీలక మలుపు తిరిగింది. బుధవారం పోలీసులు పొన్నూరులో ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా రేషన్ బియ్యం అక్రమ రవాణాతో సంబంధం ఉన్నవారని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఇప్పటికే ఇదే మాఫియా గతంలో మరో వ్యాపారిని హత్య చేసిన రికార్డు ఉందని సమాచారం. ప్రస్తుతం ఐదుగురు అనుమానితులను ఒంగోలు తరలించి విచారణ చేపట్టారు.
News April 24, 2025
జాబ్ కోసం తిరుగుతున్నారా? గుంటూరులోనే మీకు గోల్డెన్ ఛాన్స్!

గుజ్జనగుండ్లలోని ఉపాధి కార్యాలయంలో ఈ నెల 25న జాబ్ మేళా జరగనుంది. ప్రముఖ సంస్థలు ఉద్యోగుల నియామకానికి ముందుకొస్తుండగా, పదోతరగతి నుంచి పీజీ వరకు చదివిన అభ్యర్థులు అర్హులు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చని జిల్లా ఉపాధి అధికారి దుర్గాబాయి మంగళవారం తెలిపారు. తమ బయోడేటా, విద్యాసర్టిఫికెట్లు, ఆధార్, ఫోటోతో రావాలని ఆమె సూచిస్తున్నారు.
News April 24, 2025
తెనాలి జిలేబికి ప్రత్యేక గుర్తింపు

తెనాలి జిలేబికి ప్రత్యేక గుర్తింపు ఉంది. 19వ శతాబ్దం చివరలో మొదలైన దీని తయారీని సుబ్బయ్య ఆధునిక రూపానికి తెచ్చారు. 1965లో తెనాలి రైల్వే స్టేషన్ ఎదురుగా ఆయన ప్రారంభించడంతో ఈ ప్రాంతం ‘జిలేబి కొట్టు బజారు’గా మారింది. సాధారణ జిలేబిలకు భిన్నంగా, తెనాలి జిలేబిలో బెల్లం పాకం వాడతారు. దీనివల్ల ప్రత్యేక రుచి, ముదురు రంగు, సువాసన వస్తాయి. ఈ ప్రత్యేకతే తెనాలి జిలేబిని ప్రసిద్ధి చేసింది.