News November 8, 2024
లా పరీక్షా కేంద్రాన్ని వైస్ ఛాన్సలర్ ఆకస్మిక తనిఖీ

వెంకటాచలం మండలంలోని విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలో నెల్లూరు నగరంలో ఉన్న వీఆర్ ఐ.ఏ.ఎస్ కళాశాలలో గురువారం జరిగిన ‘లా’ మూడవ, ఐదవ సెమిస్టర్ పరీక్షలను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎస్. విజయ భాస్కర రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో భాగంగా వీఆర్ ఐ.ఎ.ఎస్ కళాశాలలో ఏర్పాటుచేసినా ‘లా’ పరిక్షకేంద్రాన్ని, వసతులను ఆయన పరిశీలించారు.
Similar News
News September 18, 2025
NLR: ఒక్క ప్రమాదం.. 4కుటుంబాల్లో విషాదం

సంగం(M) పెరమన ఘోర <<17737459>>ప్రమాదం <<>>పలువురిని రోడ్డున పడేసింది. ఇందుకూరుపేటకు చెందిన భార్యాభర్త శ్రీనివాసులు, లక్ష్మి చనిపోగా వీరి పిల్లలు(9, 6th క్లాస్) అనాథలయ్యారు. శ్రీనివాసులు, రాధ(నెల్లూరు) నిన్న మృతిచెందగా రెండేళ్ల కిందటే వీళ్ల కుమార్తె ఉరేసుకుంది. కుమారుడు శ్యాం అనాథయ్యాడు. శ్రీనివాసులు హోటల్లో పనిచేసే బ్రహ్మయ్య కారు డ్రైవర్గా వచ్చి చనిపోగా.. ఇదే ఘటనలో శారమ్మ, బాల వెంగయ్య(వదిన, మరిది) కన్నుమూశారు.
News September 17, 2025
NLR: బాలికతో అసభ్య ప్రవర్తన.. కేసు నమోదు

ఉదయగిరికి చెందిన ఓ మహిళ భర్త ఏడాది క్రితం చనిపోయాడు. ఆమెకు కుమారుడు, 14 ఏళ్ల కుమార్తె ఉంది. నెల్లూరు BVనగర్కు చెందిన వెంకటేశ్తో ఆ మహిళకు పరిచయం ఏర్పడింది. పిల్లలను బాగా చూసుకుంటానని అతను నమ్మించి కొండాయపాలెంలో ఇంటిని తీసుకున్నాడు. గత నెల 30న కుమార్తెతో కలిసి మహిళ ఈ ఇంటికి వచ్చింది. ఆమె బయటకు వెళ్లిన సమయంలో బాలికతో వెంకటేశ్ అసభ్యంగా ప్రవర్తించాడు. పోక్సో కేసు నమోదైంది.
News September 17, 2025
కావలిలో SI ఇంటి ముందు మహిళ ఆందోళన

కావలిలోని ముసునూరులో SI వెంకట్రావు ఇంటిముందు మంగళవారం రాత్రి ఓ మహిళ ఆందోళనకు దిగింది. గతంలో ఎస్ఐ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశారని ఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీనిపై విచారించిన పోలీసులు ఎస్ఐ వెంకట్రావుపై కేసు నమోదు చేసి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. నగదు ఇచ్చేలా ఇటీవల ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు. మధ్యవర్తులు తనకు నగదు ఇవ్వలేదని ఆమె నిన్న రాత్రి ఒంటిమీద పెట్రోల్ పోసుకుని ఆందోళన చేసింది.