News November 8, 2024
లా పరీక్షా కేంద్రాన్ని వైస్ ఛాన్సలర్ ఆకస్మిక తనిఖీ

వెంకటాచలం మండలంలోని విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలో నెల్లూరు నగరంలో ఉన్న వీఆర్ ఐ.ఏ.ఎస్ కళాశాలలో గురువారం జరిగిన ‘లా’ మూడవ, ఐదవ సెమిస్టర్ పరీక్షలను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎస్. విజయ భాస్కర రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో భాగంగా వీఆర్ ఐ.ఎ.ఎస్ కళాశాలలో ఏర్పాటుచేసినా ‘లా’ పరిక్షకేంద్రాన్ని, వసతులను ఆయన పరిశీలించారు.
Similar News
News February 21, 2026
బుచ్చిలో రూ.కోట్లలో క్రికెట్ బెట్టింగ్..?

బుచ్చి క్రికెట్ బెట్టింగ్కు అడ్డాగా మారింది. నిత్యం కోట్లలో బెట్టింగ్ సాగుతుంది. నిన్న పోలీసులు అరెస్ట్ చేసిన ఇద్దరు వద్ద పట్టుబడ్డ నగదే ఇందుకు సాక్ష్యం. రాదే ఎక్స్ఛేంజ్ యాప్ తరహాలో ఎన్నో యాప్ల ద్వారా యువతే లక్ష్యంగా నిత్యం బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. యువత బెట్టింగుల్లో డబ్బులు పోగొట్టుకొని ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా ఎస్పీ దృష్టి పెడితే ఎందరో బెట్టింగ్ రాయుళ్లు వెలుగులోకి వచ్చే అవకాశం.
News February 21, 2026
సోషల్ మీడియా ద్వారా సమస్యలు చెబుతున్న చిన్నారులు

సోషల్ మీడియాతో విద్యార్థులు పెడదారిన పడుతున్న సమయంలో అదే వేదికగా తమ సమస్యలు పాలకుల దృష్టికి తీసుకు వెళ్తున్న సందర్భాలు జరుగుతున్నాయి. ఇటీవల కొండాపురం (M) గజ్జలవారిపల్లి గ్రామానికి విద్యార్థులు రోడ్డు లేదని సోషల్ మీడియా ద్వారా తెలియజేయడంతో పవన్ కళ్యాణ్ స్పందించారు. అదే పందాను అనుసరిస్తూ విద్యార్థులు తమకు రోడ్లు లేవని చేతులెత్తి ముక్కుతూ వీడియో విడుదల చేయడం కొత్త ట్రెండ్ను సృష్టిస్తుంది.
News February 21, 2026
గౌతమ్.. నిన్ను ఎప్పటికీ మరచిపోలేను: జగన్

నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి గౌతమ్ రెడ్డి వర్ధంతి నేడు. ఈనేపథ్యంలో ఆయనతో తనకు ఉన్న బంధాన్ని మాజీ సీఎం జగన్ గుర్తు చేసుకున్నారు. ‘డియర్ గౌతమ్.. మన స్నేహంతో కూడిన మధురమైన జ్ఞాపకాలను నేను ఎప్పటికీ మరిచిపోలేను. నువ్వు నాకు స్నేహితుడే కాదు సోదరుడివి. నువ్వు ఎప్పటికీ నా హృదయంలో నిలిచిపోతావు’ అంటూ జగన్ భావోద్వేగపూరిత ట్వీట్ చేశారు.


