News October 8, 2024

లింగంపేటలో ట్రాక్టర్ బోల్తా పడి బాలుడు మృతి

image

లింగంపేట మండలంలోని బోనాలు తండాలో విషాదం చోటు చేసుకుంది. తండాకు చెందిన రిషికేష్ (6) మంగళవారం ఇంటి సమీపంలో ఉన్న ఆగి ఉన్న ట్రాక్టర్ పై ఎక్కి ఆడుకుంటూ గేర్లను డౌన్ చేశాడు. దీంతో ట్రాక్టర్ గుంతలో బోల్తా పడి బాలుడు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.

Similar News

News October 8, 2024

HYDలో రేపు MLA KVR ప్రెస్ మీట్

image

HYD సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్‌లో రేపు మ.12 గంటలకు కామారెడ్డి BJP MLA వెంకట రమణారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ‘హైడ్రా’ పనితీరు గురించి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడనున్నట్లు తెలియజేశారు. కాగా ఇప్పటికే హైడ్రా పనితీరును కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ వ్యతిరేకించిన విషయం తెలిసిందే. మరి KVR ఏం చెబుతారో ఉత్కంఠ నెలకొంది.

News October 8, 2024

చందూర్ పెద్ద చెరువులో పడి వ్యక్తి మృతి

image

నిజామాబాద్ జిల్లా చందూర్ మండలంలో చెరువులో పడి వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన శ్రీనివాస్ మృతి చెందినట్లుగా గ్రామస్థులు తెలిపారు. కాగా ప్రమాదవశాత్తు మృతి చెందాడా.. లేక ఆత్మహత్య చేసుకున్నాడా తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని స్థానికులు బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

News October 8, 2024

బోధన్: స్నేహితుడిపై కోపంతో సొంత వాహనానికి నిప్పు

image

బోధన్ పోలీస్ స్టేషన్ ఎదుట సాయిలు అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనాన్ని తానే తగలబెట్టుకున్నాడు. తన స్నేహితుడు శంకర్ పదేళ్ల క్రితం రూ.70 వేలు తీసుకుని మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తిరిగి ఇవ్వమని కోరితే ఎలాంటి స్పందన లేకపోవటంతో పోలీసులను ఆశ్రయించాడు. ఈ విషయం తమ పరిధిలోకి రాని అంశమని పోలీసులు సూచించగా తనకు న్యాయం జరిగే వరకూ పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లేది లేదని తన బైకును సాయిలు తగలబెట్టుకున్నాడు.