News January 24, 2025

లింగంపేట్: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

image

అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన లింగంపేట్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. SI సుధాకర్ వివరాలిలా.. లింగంపేట్‌కు చెందిన కాశిరాం(50) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆసుపత్రిలో చూపించినా జబ్బు నయం కాలేదు. దీంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో దూలానికి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Similar News

News November 7, 2025

తరచూ ఛాతి ఎక్స్‌రేలు తీయించుకుంటున్నారా?

image

చాలామంది వార్షిక హెల్త్ చెకప్స్‌లో రక్త పరీక్షలతో పాటు ఎక్స్‌రేలు చేయించుకుంటారు. అయితే ఆరోగ్యంగా ఉండి, ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేని వ్యక్తులు చెస్ట్ ఎక్స్-రేలు తీసుకోనక్కర్లేదని వైద్యులు సూచిస్తున్నారు. ‘ఎక్స్-రేలు తరచూ తీయించుకుంటే రేడియేషన్‌కు గురవుతారు. ఇది దీర్ఘకాలంలో సమస్యలకు దారితీయవచ్చు. దగ్గు, జ్వరం, టీబీ వంటి అనారోగ్యం బారిన పడినవారు వైద్యుల సూచనతో తీసుకోవాలి’ అని పేర్కొన్నారు.

News November 7, 2025

నిజామాబాద్: మలావత్ పూర్ణకు పితృ వియోగం

image

అత్యంత పిన్న వయస్సులో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి ప్రపంచ రికార్డు సృష్టించిన మలావత్ పూర్ణకు పితృవియోగం కలిగింది. ఆమె తండ్రి దేవీదాస్(50) శుక్రవారం అనారోగ్యంతో మృతిచెందారు. గత కొంతకాలంగా కామారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కోమాలో ఉన్న ఆయన ఇవాళ ఉదయం కన్నుమూశారు. అంత్యక్రియలు సాయంత్రం ఆయన స్వస్థలం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పాకాల గ్రామంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News November 7, 2025

వేమూరి వినోద్ అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు

image

AP: కర్నూలు బస్సు <<18110276>>ప్రమాద ఘటన<<>>లో వి.కావేరి ట్రావెల్స్ యజమాని, A2 వేమూరి వినోద్ కుమార్‌ను అరెస్టు చేసినట్లు ఎస్పీ విక్రాంత్ వెల్లడించారు. కర్నూలు కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. OCT 28న A1 డ్రైవర్ లక్ష్మణ్‌ను అరెస్టు చేశారు. గత నెల జరిగిన ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే.