News January 22, 2025

లింగమంతుల స్వామి జాతర టెండర్లు ఖరారు

image

సూర్యాపేట పరిధిలోని దురాజ్‌పల్లి లింగమంతుల స్వామి జాతర సందర్భంగా ఎగ్జిబిషన్, చిరు దుకాణాల కాళి స్థలం, మిఠాయి, స్వీట్స్, వరి పేలాలు, బొంగులు, చెరుకు గడలు, జాతర చుట్టూ విద్యుత్ సరఫరాకు టెండర్లను మున్సిపల్ కమిషనర్ బి. శ్రీనివాస్ బుధవారం ఖరారు చేశారు. ఆయన మాట్లాడుతూ.. గతంలో జాతరలో మున్సిపాలిటీకి టెండర్ల మీద ఆదాయం రూ. 56,43,754 రాగా ఈసారి రూ. 68,83,650 మున్సిపాల్టీకి సమకూరనున్నట్లు చెప్పారు.

Similar News

News November 5, 2025

పశువులకు రేబీస్ వ్యాధి ఎలా వస్తుంది?

image

పశువుల్లో ఈ వ్యాధి ‘రేబీస్’ వైరస్‌వల్ల వస్తుంది. ఈ వైరస్ సోకిన కుక్కలు, పిల్లులు, నక్కలు.. పశువులు, గొర్రెలు, మేకలను కరిచినప్పుడు రేబీస్ సోకుతుంది. అలాగే రేబీస్ సోకిన జంతువుల లాలాజలం, కంటి స్రావాలు.. పాడి పశువుల శరీరంపై ఉన్న గాయాలపై పడినప్పుడు కూడా రేబీస్ వస్తుంది. ఈ వ్యాధి బారినపడిన పశువుల పాలను సరిగా మరిగించకుండా తాగినా, మాంసాన్ని సరిగా ఉడికించకుండా తిన్నా ఈ వ్యాధి మనుషులకూ సోకే అవకాశం ఉంది.

News November 5, 2025

కపిలతీర్థ ముక్కోటి అంటే తెలుసా.?

image

కార్తీక మాసం పౌర్ణమి రోజున కపిలతీర్థంలో అన్నాభిషేక వార్షిక సేవను నిర్వహిస్తారు. దీనినే కపిలతీర్థ ముక్కోటి అని అంటారు. ఆ రోజున మధ్యాహ్న సమయంలో మహాలింగానికి ఏకాంతంగా అన్నాభిషేకం నిర్వహిస్తారు. ఈ ప్రసాదం స్వీకరించేందుకు భక్తులు ఆసక్తి చూపుతారు.

News November 5, 2025

HYD-VJA ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్

image

హైదరాబాద్-విజయవాడ మీదుగా వెళ్లే NH-65 విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రోడ్డులో 40-269KM మధ్య 229KM వరకు నాలుగు లేన్ల రోడ్డును ఆరు లేన్లకు పెంచనుంది. ఇందుకోసం భూసేకరణ చేయడానికి AP, TGల్లో అధికారులను నియమించింది. నందిగామ, కంచికచర్ల, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, ఇబ్రహీంపట్నం, విజయవాడ పరిధిలోని 34 గ్రామాల్లో భూసేకరణ చేయనున్నారు. ఈ విస్తరణకు రూ.10వేల కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయని అంచనా.