News August 11, 2024

లింగారెడ్డిపేటలో కరెంట్ షాక్‌తో రైతు మృతి

image

కరెంట్ షాక్‌తో రైతు మృతి చెందిన ఘటన ఎల్లారెడ్డి మండలం లింగారెడ్డిపేట‌లో శనివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ మహేష్ కథనం ప్రకారం.. మామిడి చిరంజీవులు తన భార్యతో కలిసి వరి పొలానికి మందు చల్లుతున్నారు. దాహం వేయడంతో బోరు మోటర్ వద్దకు వెళ్లి చూడగా స్టార్టర్ బాక్స్ పాడైంది. మరమ్మత్తుల నిమిత్తం నియంత్రిక హ్యాండిల్‌ను పట్టుకోగా విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Similar News

News January 27, 2026

NZB: 20 కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణ: కమిషనర్

image

నిజామాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి 60 డివిజన్లో అభ్యర్థుల నామినేషన్ స్వీకారం కోసం 20 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ తెలిపారు. మూడు డివిజన్లకు కలిపి ఒక కేంద్రం చొప్పున నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పోటీ చేసే అభ్యర్థులు తమ కేంద్రాలను గుర్తించాలని సూచించారు.

News January 27, 2026

NZB: ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని విధాలుగా సిద్ధం: కలెక్టర్

image

ఎన్నికల సంఘం నియమ, నిబంధనలకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని NZB కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎన్నికల కమిషనర్ దృష్టికి తెచ్చారు. ఎన్నికల షెడ్యూల్ ను అనుసరిస్తూ బుధవారం నుండి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు వీలుగా ఆయా మున్సిపాలిటీల పరిధిలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

News January 27, 2026

నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి బదిలీ

image

నిజామాబాద్ నగర ఏసీపీ ఎల్. రాజా వెంకటరెడ్డి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సైబరాబాద్ ఎస్బీ ఏసీపీగా పనిచేస్తున్న బి. ప్రకాష్‌ను నియమిస్తూ డీజీపీ శశిధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. 2024 ఫిబ్రవరిలో బాధ్యతలు చేపట్టిన రాజా వెంకటరెడ్డి బదిలీ కావడం నగరంలో చర్చనీయాంశమైంది. బదిలీ అయిన ఆయనను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని అధికారులు ఆదేశించారు.