News April 25, 2025

లింగాల: పడిపోయిన అరటికాయల ధరలు.. ఆవేదనలో రైతులు

image

అరటి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇటీవల బలమైన ఈదురుగాలులకు అరటి గెలులతో ఉన్న చెట్లు పడిపోగా.. ప్రస్తుతం అరటికాయల ధరలు పడిపోయాయి. అరటి రైతుల పరిస్థితి ‘గోరుచుట్టుపై రోకలి పోటు’ అన్న చందంగా తయారైంది. ప్రస్తుతం టన్ను అరటికాయల ధరలు నాలుగైదు వేలు పలుకుతున్నాయి. అరటి కాయలను ఉన్న ధరలకు అమ్ముదామనుకుంటే వాటిని కొనుగోలు చేసేందుకు వ్యాపారస్థులు ముందుకు రావడంలేదు.

Similar News

News September 9, 2025

ప్రొద్దుటూరు: బార్‌లుగా మారిన బ్రాంది షాపులు

image

మద్యం దుకాణల్లో బల్లలు వేసి, మద్యం తాగించడానికి పర్మిట్ రూములకు అనుమతులు పొందారు. ప్రొద్దుటూరు ప్రోహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 21 మద్యం దుకాణాలు ఉన్నాయి. మున్సిపాలిటీలో 18, రూరల్ ప్రాంతంలో 3 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇక్కడి మద్యం దుకాణాల యజమానులు పర్మిట్ రూముల ఏర్పాటుకు ప్రభుత్వానికి మున్సిపాలిటీలో ఏడాదికి రూ.7.50 లక్షలు, రూరల్‌లో రూ.5 లక్షలు చొప్పున 3 నెలలకు డబ్బులు చెల్లించారు.

News September 9, 2025

పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు: కలెక్టర్

image

పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను రైతులు విధిగా వేయించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ సూచించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. జిల్లాలో 3,71,400 డోసుల టీకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 4 నెలలు వయస్సు దాటిన పశువులకు టీకాలు వేయించాలన్నారు.

News September 9, 2025

కడప: ఉల్లి కొనుగోలుకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు

image

ఉల్లి రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం చేసిందని జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. సోమవారం యూరియా సరఫరా, ఉల్లి పంట కొనుగోలుపై CM, CSలతో VC సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఉల్లి కొనుగోలు కోసం కమలాపురం, మైదుకూరులలో కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈనెల 4 నుంచి ఉల్లిపంట కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైందన్నారు. యూరియాపై రోజువారీ పర్యవేక్షణ చేస్తున్నామన్నారు.