News February 24, 2025
లింగాల మండలంలో దారుణ హత్య

లింగాల మండలంలో దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. దిగువపల్లి గ్రామంలో పప్పూరు గంగిరెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం మధ్యాహ్నం దారుణంగా హత్య చేశారు. పొలం పనుల నిమిత్తం పొలం వద్దకు వెళ్లిన గంగిరెడ్డిని వేట కొడవల్లతో నరికి హత్య చేసినట్లు భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 24, 2025
కడప జిల్లా TODAY TOP NEWS

➢ రేపు పులివెందులకు రానున్న జగన్
➢ మార్చి 1న కడపకు వస్తున్న హీరోయిన్ మెహరీన్
➢ కమలాపురం: కష్టాల కడలిలో కుల వృత్తులు
➢ YVU నూతన వైస్ ఛాన్స్లర్గా ప్రకాశ్ బాబు బాధ్యతలు
➢ జగన్ అసెంబ్లీకి వెళ్తే వారికి సినిమా: కడప ఎంపీ
➢ లింగాల మండలంలో దారుణ హత్య
➢ జగన్ సంతకం పెట్టడానికే అసెంబ్లీకి వెళ్లారు: బీటెక్ రవి
➢ మార్చి 1 నుంచి జమ్మలమడుగులో ప్లాస్టిక్ నిషేధం
➢ శివరాత్రికి పొలతలలో ఏర్పాట్లు పూర్తి
News February 24, 2025
ఇవాళ కడపలో యథావిధిగా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం కడప కలెక్టరేట్లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. మండల గ్రామస్థాయిలో పరిష్కారం కాని సమస్యలపై ప్రజలు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ సూచించారు. కావున ప్రజలు అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్వీకరించనున్నట్లు * అవకాశం
News February 23, 2025
తొండూరు: అక్రమ సంబంధం ఎంత పని చేసింది

మల్యాల ఘాట్ ముళ్ల పొదల్లో శనివారం మృతదేహం వెలుగుచూసిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల.. చిలమకూరుకు చెందిన శివరామిరెడ్డి(56) ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ, గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం ఉంది. మనస్పర్ధలతో ఇద్దరు వేరుగా ఉండగా, ఆమె అద్దెన్నతో సంబంధం పెట్టుకోగా శివరామిరెడ్డి వారించాడు. తమకు అడ్డుగా ఉన్నాడని భావించి శివరామిరెడ్డిని ఇంటికిపిలిచి కళ్లలో కారం కొట్టి తాడుతో గొంతు బిగించి హత్య చేశారు.