News September 23, 2025
లింగాల: సెల్ఫోన్ కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య

నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండల కేంద్రంలో ఓ యువకుడు సెల్ఫోన్ కోసం ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చరణ్ (18) అనే యువకుడు సోమవారం రాత్రి కొత్త సెల్ఫోన్ కొనివ్వమని తన తల్లిని కోరాడు. ఆర్థిక సమస్యల వల్ల తల్లి జీతం వచ్చాక కొనిస్తానని చెప్పడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
Similar News
News September 23, 2025
ఐఐఆర్ఎస్ఆర్ ఏర్పాటు ఇంకెప్పుడూ….?

టిష్యూ కల్చర్ పద్ధతిలో అభివృద్ధి చేసి ఎర్రచందనాన్ని తక్కువ సమయంలో ఎక్కువ లాభాలను ఇచ్చే మొక్కగా అభివృద్ధి చేయాలని కేంద్ర పర్యావరణ అటవీశాఖ 2022లో నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఏపీలో ఎర్రచందన పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంజూరు చేసినప్పటికీ, అది ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ల్యాబ్లో పరిశోధన దశలో ఉన్న ఎర్రచందనాన్ని రైతులు పెంచుకునేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది.
News September 23, 2025
విశాఖలో రెండో రోజు జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సు

నగరంలోని నోవాటెల్ హోటల్లో 28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సు రెండో రోజు కొనసాగింది. సదస్సులో భాగంగా ‘సివిల్ సర్వీసెస్ & డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్’ అంశంపై మూడో ప్లీనరీ సెషన్ నిర్వహించారు. ఈ సెషన్కు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ సెక్రటరీ రష్మీ చౌదరి ప్రధాన వక్తగా వ్యవహరించారు. చర్చలో పలు రాష్ట్రాల ఉన్నతాధికారులు పునీత్ యాదవ్, మోహన్ ఖంధార్, అహ్మద్ బాబు, ఎస్.సాంబశివరావు, పీయూష్ సింగ్లా పాల్గొన్నారు.
News September 23, 2025
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్కు 3,01,321 క్యూసెక్కుల

SRSP నుంచి 3,01,321 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 40 వరద గేట్ల ద్వారా నీటిని గోదావరిలోకి వదులుతున్నట్లు అధికారులు చెప్పారు. ఎగువ ప్రాంతాల నుంచి 1,52,225 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులో వచ్చి చేరుతున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 72.23 TMCల నీరు నిల్వ ఉంది.