News April 6, 2026
లేఆఫ్స్ వద్దు.. రీస్కిల్లింగ్పై దృష్టి పెట్టండి: NITES

టెక్ కంపెనీలు లేఆఫ్స్కు బదులు ఉద్యోగుల స్కిల్స్ను పెంచడంపై దృష్టి పెట్టాలని IT ఉద్యోగుల సంఘం ‘నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్’ అభిప్రాయపడింది. లేఆఫ్స్ను చివరి ఆప్షన్గా చూడాలంది. ప్రైవేట్ సెక్టార్లో లే ఆఫ్స్, నోటీస్ పీరియడ్స్, పరిహారాలకు సంబంధించి స్పష్టమైన నిబంధనలు లేవని, ప్రభుత్వాలు జోక్యం చేసుకొని ఉద్యోగుల హక్కులను కాపాడాలని సంఘం ప్రెసిడెంట్ హర్ప్రీత్ సింగ్ సలూజా కోరారు.
Similar News
News April 19, 2026
‘కొంగ జపం’ చేసేవారితో జాగ్రత్త!

భగవంతుడి నామాన్ని నిత్యం పలకడాన్ని ‘జపం’ అంటారు. మంచివారిగా నటిస్తూ మోసం చేసేవారి గురించి చెప్పే సందర్భంలో ‘కొంగ జపం’ జాతీయాన్ని ఉపయోగిస్తాం. ఇది పంచతంత్రంలోని కొంగ-ఎండ్రకాయ కథ నుంచి వచ్చింది. ఎండిపోతున్న చెరువులో ఓ కొంగ ఉండేది. వేటాడటం కష్టమవడంతో కళ్లు మూసుకొని జపం చేస్తున్నట్లు నటించేది. చేపలను మరో చెరువులోకి తీసుకెళ్తానని చెప్పి తినేది. చివరికి ఎండ్రకాయ దానిని చంపేస్తుంది.
<<-se>>#EPICSAYINGS<<>>
News April 19, 2026
పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై చిరంజీవి అప్డేట్

తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ‘కళ్యాణ్ బాబుకు విజయవంతంగా <<19685329>>సర్జరీ<<>> జరిగింది. ఇప్పుడు సురక్షితంగా ఉన్నారు. కోలుకుంటున్నారు. సాధారణ స్థితికి వచ్చేందుకు వారం పడుతుందని డాక్టర్లు చెప్పారు. ఆందోళన చెందాల్సిన పని లేదు. పవన్ కోలుకోవాలని ప్రార్థించిన, ప్రేమ చూపించిన వారందరికీ ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు.
News April 19, 2026
ఖమేనీ ఖననంపై నో క్లారిటీ?

ఇరాన్ మాజీ సుప్రీంలీడర్ అలీ ఖమేనీ <<19268847>>హతమై<<>> దాదాపు రెండు నెలలు కావస్తున్నా ఆయన అంత్యక్రియలు ఇంకా జరగలేదు. యుద్ధం, భద్రత సహా నిర్వహణలో సవాళ్లే ఇందుకు కారణమని అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. ప్రభుత్వ లాంఛనాలతో భారీ ఊరేగింపు మధ్య నిర్వహించాలని ఇరాన్ భావిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాకపోవడంతో అంత్యక్రియలను వాయిదా వేస్తోంది. కాగా ఖమేనీ కుమారుడు మొజ్తబా కూడా ఈ దాడుల్లో తీవ్రంగా గాయపడ్డారు.


