News February 19, 2025
లేబర్ బడ్జెట్ లక్ష్యాన్ని అధిగమించండి: కలెక్టర్

నంద్యాల జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద పెండింగ్లో ఉన్న 12 లక్షల వేతనదారుల లేబర్ బడ్జెట్ లక్ష్యాన్ని అధిగమించేందుకు ఏపీడీలు, ఎంపీడీవోలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని ఎన్ఐసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉపాధి హామీ లక్ష్యాల ప్రగతిపై సమీక్షించారు. మార్చి 31వ తేదీ లోగా పూర్తి చేయాలని ఎంపీడీవో, ఏపీడీ, ఏపీవోలను ఆదేశించారు.
Similar News
News March 13, 2025
అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

> కోయ్యూరులో అర్థరాత్రి మార్గమధ్యలో ప్రసవం
>జిల్లాలో భూములు రిజిస్ట్రేషన్ చేయండి
>దేవీపట్నంలో పెళ్లి రోజే ఆమెకు చివరి రోజు
>అల్లూరిలో ఇంటర్ పరీక్షలకు 301మంది గైర్హాజరు
>రంపచోడవరంలో జీడిపిక్కలు కొనుగోలు చేస్తాం
>రాజవొమ్మంగిలో ఠారెత్తిస్తున్న ఎండలు..నిర్మానుష్యంగా రహదారులు
>పాడేరు జనసేన నేతపై దాడి..కేజీహెచ్కు తరలింపు
>అరకులో పర్యటించిన సీఆర్డీ జాయింట్ కమిషనర్
News March 13, 2025
‘శ్రీ సత్య సాయి జిల్లాను నేర రహిత జిల్లాగా మారుద్దాం’

శ్రీ సత్య సాయి జిల్లాని నేర రహిత జిల్లాగా మారుద్దామని ఎస్పీ రత్న పేర్కొన్నారు. గురువారం సాయంత్రం హిందూపురం సమీపంలోని అప్పలకొండ క్రాస్ వద్ద డీఎస్పీ మహేశ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం మహిళలకు పురుషులతో పాటు సమాన హక్కులు కల్పించిందని పేర్కొన్నారు. హక్కులను వినియోగించుకొని జిల్లాలను నేర రహిత జిల్లాగా మారుద్దాం అన్నారు.
News March 13, 2025
పాడేరు: ‘కవయిత్రి మొల్లమాంబ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి’

నేటి యువత, విద్యార్థిని, విద్యార్థులు కవయిత్రి మొల్లమాంబ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని స్ఫూర్తి పొందాలని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో కవయిత్రి మొల్ల జయంతిని నిర్వహించారు. మొల్ల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం మొల్ల జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేసిందన్నారు. రామాయణాన్ని సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేలా రచించారని కొనియాడారు.